PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుణేకు వెళ్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పుణేలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. మణిపూర్లో హింసకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువజన విభాగం నగరం అంతటా పోస్టర్లు అంటించింది. ఈ పోస్టర్లలో కొన్నింటిపై 'మోదీ గో బ్యాక్' అని ఉండగా, మరికొన్నింటిపై 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్' అని రాసి ఉన్న పోస్టర్లు కనిపించాయి. ఇంకొన్ని పోస్టర్లలో 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, గో టు మణిపూర్, ఫేస్ ది పార్లమెంట్' అని రాసి ఉంది. ఈ పోస్టర్లను తొలగించే ప్రయత్నంలో పూణే మున్సిపల్ సిబ్బంది ఉన్నట్లు ఓ సినియర్ పోలీస్ అధికారి తెలిపారు.