NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ 
    తదుపరి వార్తా కథనం
    'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ 
    బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి

    'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    04:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ, బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక లేఖ రాశారు.

    ఆయన లేఖలో, బంగ్లాదేశ్‌లో హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్రమైన అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని కోరారు.

    వివరాలు 

    దుర్గాపూజ పండగలకు అంతరాయం ఏర్పడింది

    "నేను ఈ లేఖను భారతదేశం హృదయంతో రాస్తున్నాను. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అన్యాయానికి గురవుతున్నాయి. డా. యూనస్ మైక్రోఫైనాన్స్ ద్వారా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందినప్పటికీ, అతని పాలనలో మానవాళికి వ్యతిరేకమైన క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి. ఈ దశలో హిందూ సమాజం చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. సామూహిక హత్యలు, లక్ష్యంగా చేసుకుని దాడులు, అత్యాచారాలు, మతపరమైన అణిచివేతలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయి. దుర్గాపూజ పండగలకు అంతరాయం ఏర్పడింది". అని లేఖలో ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    అఘాయిత్యాలు ప్రేరేపించే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం తప్పు

    మహతో తన లేఖలో మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్‌లో సామూహిక హత్యల వెనక డాక్టర్ మహ్మద్ యూనస్ సూత్రధారిగా ఉన్నారని ఆరోపించారు.

    "నోబెల్ శాంతి బహుమతి శాంతి, న్యాయానికి వ్యతిరేకమైన వ్యక్తులకు ఇచ్చినప్పుడు, ఆ బహుమతి తన నైతికతను కోల్పోతుంది. ఒకప్పుడు సమాజ సంక్షేమ దార్శనికుడిగా పేరున్న మహ్మద్ యూనస్, ఇప్పుడు "హిందువుల కసాయి"గా మారిపోయారని, మైనారిటీలను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.

    ఆయన ఇలా అఘాయిత్యాలు ప్రేరేపించే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం తప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ

    తాజా

    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప
    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్

    బీజేపీ

    BJP : సంబరాలకు సిద్దమైన బీజేపీ కార్యకర్తలు . భారీగా ఏర్పాట్లు.  భారతదేశం
    Bjp vote share: గ్రామీణ ప్రాంత ప్రజానీకం బీజేపీని నమ్మలేదు భారతదేశం
    NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్
    BJP: బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు? త్వరలో పార్టీలో భారీ పునర్వ్యవస్థీకరణ   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025