NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు
    Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు

    Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2024
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడి హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    చిన్నారి హత్యకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బుధవారం పోలీసులకు అందింది.

    పోస్టుమార్టం నివేదికలో వైద్యులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

    ఈ ఘటన జనవరి 6 నుంచి 8 మధ్య జరిగినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు.

    కర్నాటకలో పోస్ట్‌మార్టం నిర్వహించిన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. చిన్నారి హత్య జరిగి 36 గంటల కంటే ఎక్కువైందన్నారు.

    అలాగే బాలుడి హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

    హత్య

    గోవాలో చిన్నారి హత్య

    బాలుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, హత్య కోసం దిండు కానీ, టవల్ కానీ ఉపయోగించడం వల్ల చిన్నారి ఊపిరి ఆడక చనిపోయినట్లు డాక్టర్ కుమార్ నాయక్ తెలిపారు.

    చిన్నారిని చేతులతో గొంతు నులిమి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు.

    జనవరి 6న సుచనా సేథ్ తన కొడుకుతో కలిసి గోవా వెళ్లింది. అక్కడే చిన్నారిని హత్య చేసింది.

    ఆ తర్వాత ఆమె అతని మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో ప్యాక్ చేసి టాక్సీలో గోవా నుంచి బయలుదేరింది.

    హోటల్ సిబ్బంది సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయి. సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

    హత్య

    బ్యాగ్‌లో చిన్నారి మృతదేహం

    పోలీసులు సుచనాను పిలిపించి రక్తపు మరకలపై ప్రశ్నించగా.. అది పీరియడ్ బ్లడ్ అని చెప్పింది.

    కొడుకు గురించి అడిగితే.. తాను స్నేహితురాలితో ఉన్నానని బదులిచ్చింది. తన స్నేహితుడి వద్ద తన కొడుకు ఉన్నాడని సుచనా పోలీసులకు చెప్పింది.

    దీంతో అనుమానం వచ్చిన పోలీసులు టాక్సీ డ్రైవర్‌ను పిలిపించి విచారించారు.

    ఈ క్రమంలో టాక్సీ సుచనా బ్యాగ్‌ను పరిశీలించగా.. అందులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

    దీంతో పోలీసులు సుచనా సేథ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    2010లో వెంకట్ రామన్‌ను సుచన వివాహం చేసుకుంది. వీరికి 2019లో ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    హత్య
    తాజా వార్తలు

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    బెంగళూరు

    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు ప్రతిపక్షాలు
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక  కర్ణాటక
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు ప్రతిపక్షాలు

    హత్య

    అమెజాన్ మేనేజర్ హత్య కేసులో విస్తుబోయే నిజాలు.. దిల్లీలో మాయ గ్యాంగ్ అలజడులు భారతదేశం
    ముంబై: అపార్ట్‌మెంట్‌లో ఎయిర్ హోస్టెస్ శవం.. హౌస్ కీపర్ అరెస్ట్  ముంబై
    UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    దేశ రాజధాని దిల్లీలో ఘోరం.. భార్య, కుమారుడి ముందే భర్త దారుణ హత్య దిల్లీ

    తాజా వార్తలు

    Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా  బంగ్లాదేశ్
    Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత  దిల్లీ
    Israel - Hamas war: ఉత్తర గాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్
    Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్ గుంటూరు కారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025