NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru rave party : ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్‌ పాజిటివ్‌: పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    Bengaluru rave party : ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్‌ పాజిటివ్‌: పోలీసులు 
    ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్‌ పాజిటివ్‌: పోలీసులు

    Bengaluru rave party : ఇద్దరు తెలుగు నటులకు డ్రగ్‌ పాజిటివ్‌: పోలీసులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2024
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

    పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు.వారిలో ఇద్దరు తెలుగు నటులు కూడా ఉన్నట్లు చెప్పారు.

    వీరికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు సీసీబీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు సిద్ధమవుతున్నారు.

    తాను హైదరాబాద్‌లో ఉన్నానని,రేవ్ పార్టీలో లేనంటూ ఓ తెలుగు నటి బెంగళూరులో వీడియో తీసింది.అయితే, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న రేవ్ పార్టీలో ప్రముఖ తెలుగు నటి నిజంగానే ఉందని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద తర్వాత ప్రకటించారు.

    మరో ప్రముఖ తెలుగు నటి తాను పార్టీకి హాజరయ్యానని ఒప్పుకుంది,అయితే లోపల ఏమి జరుగుతుందో తనకు తెలియదని తెలిపింది.

    Details 

    ఐదుగురు వ్యక్తులు అరెస్టు

    మే 20న 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరుతో జరిగిన రేవ్ పార్టీకి టెక్కీలు,తెలుగు నటీనటులు, తదితరులతో సహా దాదాపు 100 మంది హాజరైన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు.

    పార్టీకి హాజరైన వారు ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర పదార్థాలను వినియోగించారని ఆరోపించారు.

    ఫామ్‌హౌస్‌లో మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న కర్ణాటక పోలీసులు, డ్రగ్స్ సరఫరాతో పాటు సెక్స్ రాకెట్ కూడా పనిచేస్తుందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

    ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

    Details 

    కర్ణాటకను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: పరమేశ్వర

    పోలీసు శాఖ దర్యాప్తును ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ నుండి సిటీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) నార్కోటిక్స్ విభాగానికి బదిలీ చేసింది.

    కర్ణాటకను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, రేవ్ పార్టీలను సహించేది లేదని హోంమంత్రి జి.పరమేశ్వర అన్నారు.

    చదువుల కోసం కర్ణాటకకు వచ్చి మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా చేసే విద్యార్థులపై నిఘా ఉంచామని, వారిని వారి రాష్ట్రాలకు పంపిస్తామని హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బెంగళూరు

    13000 Nude Photos: బాయ్ ఫ్రెండ్ ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. యువతి షాక్ ఇండియా
    Bengaluru: బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు  భారతదేశం
    Bengaluru : అసభ్యకరంగా అరుస్తూ కారు అద్దాలను పగులగొట్టారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు భారతదేశం
    sandalwood: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025