NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: బీహార్‌లో 16 మంది ఇంజనీర్లు సస్పెండ్.. 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోవడంపై చర్యలు  
    తదుపరి వార్తా కథనం
    Bihar: బీహార్‌లో 16 మంది ఇంజనీర్లు సస్పెండ్.. 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోవడంపై చర్యలు  
    Bihar: బీహార్‌లో 16 మంది ఇంజనీర్లు సస్పెండ్.

    Bihar: బీహార్‌లో 16 మంది ఇంజనీర్లు సస్పెండ్.. 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోవడంపై చర్యలు  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 05, 2024
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లో 17రోజుల్లోనే 12వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోవడంతో ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.

    తరచూ వంతెన కూలిన ఘటనలు వెలుగులోకి రావడంతో 16మంది ఇంజనీర్లను సస్పెండ్ చేశారు.

    నితీష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ఆదేశించింది.

    రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి చైతన్య ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిది వంతెనలు దెబ్బతిన్నట్లు సమాచారం అందిందని తెలిపారు.

    వీటిలో ఆరు చాలా పాతవి.మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయి.ఇందులో ఇంజినీర్లు,కాంట్రాక్టర్ల హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

    ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తన నివేదికను అందజేసిందని తెలిపారు.ఇంజనీర్లు దీనిపై శ్రద్ధ వహించడం కానీ పర్యవేక్షించట్లేదు.

    ఈ కేసులో వివిధ పోస్టులకు చెందిన 11మంది ఇంజనీర్లను సస్పెండ్ చేశారు.

    వివరాలు 

    కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు 

    కొత్త వంతెనలు నిర్మిస్తామని అదనపు ముఖ్య కార్యదర్శి చైతన్యప్రసాద్‌ తెలిపారు.

    అంతే కాకుండా వీలైనంత త్వరగా నిర్వహణ,మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర బ్రిడ్జి కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌ను కోరారు.

    దీని ఖర్చులను కాంట్రాక్టర్ మాతేశ్వరి భరిస్తుంది.దీనికి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

    గ్రామీణ వ్యవహారాల శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి దీపక్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.మూడు వంతెనలు దెబ్బతిన్నట్లు సమాచారం అందిందని తెలిపారు.

    జూన్ 18న అరారియాలోని బఖ్రా నదిపై మొదటి నష్టంనమోదైంది.రాష్ట్ర,కేంద్ర బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

    నలుగురు ఇంజనీర్లను సస్పెండ్ చేయగా,మరో ఇద్దరు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.

    విచారణ పూర్తయ్యే వరకు ఇతర కారణాలతో కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిపివేయబడతాయి.

    తనిఖీ బృందాలు తుది నివేదిక అందించిన తర్వాత కాంట్రాక్టర్‌,కన్సల్టెంట్‌పై తుది చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    వివరాలు 

    కాంట్రాక్టర్,స్థానిక వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు

    వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అదనపు ముఖ్య కార్యదర్శి దీపక్ సింగ్ తెలిపారు.

    విధ్వంసానికి పాల్పడినందుకు కాంట్రాక్టర్ ఇప్పటికే కొంతమంది స్థానిక వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

    జూన్ 15 తర్వాత నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారో వారి నుంచి వివరణ కోరాం.ఇంకా కొన్ని వంతెనలు ఉన్నాయని, వాటి కోసం ఏజెన్సీని ఇంకా గుర్తించలేదని, మేము జిల్లా యంత్రాంగం నుండి ఇన్‌పుట్ కోరుతున్నామని దీపక్ సింగ్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బిహార్

    Bihar Politics: నితీశ్ ఉదంతం వేళ.. బిహార్‌ కాంగ్రెస్ సీనియర్ అబ్జర్వర్‌గా భూపేష్ బఘేల్ నియామకం కాంగ్రెస్
    Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు  దిల్లీ
    Bihar politics: బిహార్ కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యేల ఫోన్లు స్వీచాఫ్.. నితీశ్‌తో పాటు ఎన్డీఏ కూటమిలోకి ?  కాంగ్రెస్
    Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం  నితీష్ కుమార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025