Page Loader
Bihar: రాంగ్ షాట్.. బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చితక్కొట్టిన అదనపు కలెక్టర్
బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చితక్కొట్టిన అదనపు కలెక్టర్

Bihar: రాంగ్ షాట్.. బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చితక్కొట్టిన అదనపు కలెక్టర్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2024
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ రాష్ట్రంలోని మాధేపురా జిల్లా అదనపు కలెక్టర్ శిశిర్ కుమార్ మిశ్రా, బ్యాడ్మింటన్ ఆట ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై శారీరక దాడి చేసిన ఘటన వివాదానికి కారణమైంది. ఆయన ఆటగాళ్లను వెంబడించి, రాకెట్‌ను నేలపై వేసి, ముక్కలు చేశారు. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని మిశ్రా చెప్పారు. వైరల్ అవుతున్న వీడియోలను కొట్టిపడేస్తూ, అలాంటి ఘటన జరగలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తరణ్‌జోత్ సింగ్ విచారణ చేపట్టారు. ఈ సంఘటన ఆయన నివాస సమీపంలోని బీపీ మండల్ ఇండోర్ స్టేడియంలో జరిగింది.

వివరాలు 

తప్పుగా షాట్ కొట్టడంతో, మిశ్రా కోపం

వీడియోలో ఇద్దరు ఆటగాళ్లు బ్యాడ్మింటన్ ఆడుతుండగా, మిశ్రా మూడో ఆటగాడిని వెంబడిస్తూ రాకెట్‌ను అతడిపై విసరడం కనిపించింది. ఆ ఆటగాడు కోర్టు విడిచిపెట్టేంతవరకు మిశ్రా అతడిని వెంబడించారు. ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లను తనతో ఆడాలని మిశ్రా కోరారు. కానీ వారు తీవ్ర అలసటతో ఉండటంతో, ఆడేందుకు నిరాకరించారు. అయితే, మిశ్రాతో ఉన్నవారు పదేపదే ఒత్తిడి చేయడంతో , చివరికి వారు ఓ మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్నారు. మ్యాచ్ మధ్యలో, ఒక ఆటగాడు తప్పుగా షాట్ కొట్టడంతో, మిశ్రా కోపంతో అతడిపై దాడి చేశారు. తర్వాత, అడ్డుకునేందుకు వచ్చిన మరో ఆటగాడిని కూడా దాడి చేశారు. అతడికి మెడ, చేతులకు గాయాలు అయ్యాయి.

వివరాలు 

రాకెట్‌ను విరిచేసిన మిశ్రా

దీంతో, మిశ్రా అక్కడితో ఆగకుండా, రాకెట్‌ను విరిచేశారని, తదుపరి ప్రాక్టీస్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తరణ్‌జోత్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు, తదుపరి చర్యలు నివేదిక ఆధారంగా తీసుకుంటామని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..