Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్ సమాల్
ఒడిశాలో వచ్చే లోక్సభ,అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ శుక్రవారం వెల్లడించారు. బీజేపీతో బీజేడీ పొత్తు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర చీఫ్ మన్మోహన్ సమాల్ స్పష్టతనిచ్చారు. "గత 10 సంవత్సరాలుగా,నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా BJD జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది.దీని కోసం మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం"అని ఒడిశాలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ట్వీట్ చేశారు. 2008లో కంధమాల్ అల్లర్ల తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోయింది.ఎన్డీయే కూటమి నుంచి బీజేడీబయటకి వచ్చింది.ఈ రెండు పార్టీలు 1998-2009 వరకు 11 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నాయి.