NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arunachal Pradesh: కమలానిదే "అరుణాచల్ "ప్రదేశ్.. ముచ్చటగా పెమా ఖండూ మూడోసారి 
    తదుపరి వార్తా కథనం
    Arunachal Pradesh: కమలానిదే "అరుణాచల్ "ప్రదేశ్.. ముచ్చటగా పెమా ఖండూ మూడోసారి 
    కమలానిదే "అరుణాచల్ "ప్రదేశ్.. ముచ్చటగా పెమా ఖండూ మూడోసారి

    Arunachal Pradesh: కమలానిదే "అరుణాచల్ "ప్రదేశ్.. ముచ్చటగా పెమా ఖండూ మూడోసారి 

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2024
    11:36 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందస్తు అంనాల ప్రకారం , బీజేపీ బాగా ముందంజలో ఉంది.

    ముఖ్యమంత్రి పెమా ఖండూ మూడోసారి అధికారంలోకి రానున్నారు. రాష్ట్రంలోని 60 స్థానాల్లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    ఏకగ్రీవాలపై వివాదం

    అరుణాచల్ ప్రదేశ్‌లోని 50 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ఈరోజు భారీ భద్రత మధ్య ప్రారంభమైంది.

    అధికార బీజేపీ ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది.దీనిపై కొంత వివాదం తలెత్తింది.

    ఖండూ, ఇతర అభ్యర్ధులు వైరి పక్షాలను ప్రలోభ పెట్టారని ఆరోపణలు వచ్చాయి. సూరత్ లోక్ సభ సీటులో ముఖేష్ దలాల్ అనే బీజేపీ అభ్యర్ధి పోటీ లేకుండా గెలిచిన సంగతి తెలిసిందే.

    Details 

    భారీ వర్షం నడుమ 50 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు 

    రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో 24జిల్లా కేంద్రాల్లో ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైందని,మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)పవన్ కుమార్ సైన్ తెలిపారు.

    ఖోన్సా తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి వంగ్లం సవిన్ తన సమీప బిజెపి అభ్యర్ధి బిజెపి అభ్యర్ధి కమ్రాంగ్ తెసియాపై 2,216 ఓట్ల తేడాతో గెలుపొందారని భారత ఎన్నికల సంఘం తెలిపింది.

    Details 

    50 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు

    ఈశాన్య రాష్ట్రంలోని 50 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.

    సావిన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలిచారు. ఆయనకు ఈసారి కాషాయ పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు.

    ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరుణాచల్ ప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అరుణాచల్ ప్రదేశ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం చైనా
    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు హెలికాప్టర్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025