LOADING...
Saubhagya Singh Thakur: ప్రధాని సూచనలు పక్కనపెట్టి.. 50 కార్ల కాన్వాయ్‌తో బీజేపీ నేత భారీ ర్యాలీ.. మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం
మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం

Saubhagya Singh Thakur: ప్రధాని సూచనలు పక్కనపెట్టి.. 50 కార్ల కాన్వాయ్‌తో బీజేపీ నేత భారీ ర్యాలీ.. మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చిన రెండు రోజులకే మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత భారీ కాన్వాయ్‌తో వెళ్లడం వివాదంగా మారింది. మధ్యప్రదేశ్ టెక్స్ట్‌బుక్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులైన బీజేపీ నేత సౌభాగ్య సింగ్ ఠాకూర్ ఉజ్జయిని నుంచి భోపాల్‌కు బాధ్యతలు స్వీకరించేందుకు దాదాపు 50 ఎస్‌యూవీలు, అనుచరుల వాహనాలతో బయల్దేరారు. పూలతో అలంకరించిన వాహనాలు, భారీ ర్యాలీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వివరాలు 

కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

మార్గమధ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్‌ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరల ఒత్తిడి పెరుగుతోందని చెబుతూ ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, ప్రజా రవాణా, మెట్రో, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే విదేశీ ప్రయాణాలు, అవసరం లేని ఖర్చులను తగ్గించాలని కూడా పిలుపునిచ్చారు. అయితే మధ్యప్రదేశ్ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రజలకు ఒకలా చెప్పి, బీజేపీ నేతలు మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ప్రధాని సూచనలు దేశ ప్రయోజనాల కోసమేనని, ప్రపంచ ఇంధన సంక్షోభం దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారన్నారు.

Advertisement