NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం 
    మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం

    Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 08, 2025
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

    ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే అయోధ్య రామమందిరం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ ఎంపీ స్థానం (అయోధ్య) నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అవధేశ్ ప్రసాద్ గెలవడం సంచలనంగా మారింది.

    రామమందిర నిర్మాణం పూర్తయిన కొన్ని నెలలకే బీజేపీ ఓటమి పాలవ్వడం చర్చనీయాంశమైంది. ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ ఎంపీగా గెలవడంతో మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు.

    దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ విజయం దిశగా సాగుతోంది.

    Details

    10  వేలు మెజార్టీ దిశగా బీజేపీ

    అయోధ్యలో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్న బీజేపీ, మిల్కిపూర్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలకు సిద్ధమైంది.

    ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ మధ్య పోటీ నెలకొంది. తాజా లెక్కల ప్రకారం బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ 10,000కి పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

    ఫిబ్రవరి 5న మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మొత్తం 3.70 లక్షల మంది ఓటర్లలో 65 శాతం కంటే ఎక్కువ మంది

    తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ శాతం 2022 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా నమోదైంది.

    Details

    రామమందిర ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం 

    రామమందిరం నిర్మితమైన అయోధ్య పరిధిలోని మిల్కిపూర్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తే, ఇది పార్టీకి గట్టి ఊరట కలిగించే అంశం.

    2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ ఎంపీ స్థానం కోల్పోవడంతో బీజేపీకి తీవ్ర నిరాశ ఎదురైంది.

    అయితే మిల్కిపూర్ ఉప ఎన్నికలో విజయాన్ని కైవసం చేసుకుని తమ పట్టును తిరిగి నిరూపించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది.

    మొత్తంగా మిల్కిపూర్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం దిశగా సాగుతుండటంతో ఈ ఫలితాలు ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ఉత్తర్‌ప్రదేశ్

    5 Doctors Killed: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొన్న స్కార్పియో.. ఐదుగురు వైద్యులు మృతి రోడ్డు ప్రమాదం
    Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి.. భారతదేశం
    Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం ఇండియా
    UP: విద్యార్థి ఫిర్యాదు.. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి అందజేసిన పోలీసులు పోలీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025