Page Loader
Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!
పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!

Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 12, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ ఎంపీ, మధుర నియోజకవర్గ అభ్యర్థి హేమమాలిని ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్'లోని గోధుమ పొలాన్ని సందర్శించారు. స్థానిక రైతులతో కలిసిన కొన్ని చిత్రాలను హేమమాలిని తన ఎక్స్'లో పోస్ట్ చేసింది. పొలాల్లో పని చేసే మహిళలకు చేయూత ఇవ్వడం నుంచి వారితో ఫొటోలు దిగడం వరకు హేమ మాలిని పొలాల్లో చాలా సంతోషంగా కనిపించారు. సమాచారం ప్రకారం,హేమమాలిని, తన ఎక్స్ ఖాతాలో చిత్రాలను పంచుకుంటూ,గత పదేళ్లుగా క్రమం తప్పకుండా రైతులతో మమేకం అవుతున్నా..అలాగే ఈ రోజు నేను పొలాలకు వెళ్ళాను. రైతుల మధ్య ఇలా ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బీజేపీ వరుసగా మూడోసారి మధుర లోక్‌సభ స్థానం నుండి హేమమాలినిని పోటీకి దింపింది.

Embed

హేమమాలిని చేసిన ట్వీట్ 

Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k— Hema Malini (@dreamgirlhema) April 11, 2024