Lok Sabha polls : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్,సునీల్ బన్సాల్,ఇతరులకు కీలక పదవులు
2024 లోక్సభ ఎన్నికలకు కేవలం నెలల సమయం ఉన్నందున, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం పార్టీ విభాగాల్లో ప్రధాన నియామకాలను చేపట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు నేతలను వివిధ శాఖలకు ఇన్ఛార్జ్లుగా నియమించారు. యువమోర్చా ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్,మహిళా మోర్చా ఇన్ఛార్జ్ బైజయంత్ జే పాండా. కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ బండి సంజయ్ కుమార్. ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. ఎస్టీ మోర్చా ఇన్ఛార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్, ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే, మైనార్టీ మోర్చా ఇన్ఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్. తక్షణమే కొత్త ఇన్ఛార్జ్లు అమల్లోకి వస్తారు.