NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు
    తదుపరి వార్తా కథనం
    Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు
    ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు

    Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్‌లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge),అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కుశుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందాయి.

    ఈ నోటీసులను బీజేపీ నేత వినోద్ తావ్డే(Vinod Tawde)ఆయనపై చేసిన ఆరోపణల కారణంగా పంపించారు. ఈ నోటీసుల్లో సుప్రియా శ్రినేట్‌ పేరు కూడా ఉన్నట్లు తెలియజేశారు.

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Elections)ముందు అధికార,ప్రతిపక్షాల మధ్య తీవ్ర హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

    పాల్‌ఘర్‌ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో బీజేపీ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని బహుజన్ వికాస్ అఘాడీ(Bahujan Vikas Aghadi)పార్టీ ఆరోపించింది.

    నాలసోపరా నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌కు మద్దతు ఇచ్చేలా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తోందని ఈ పార్టీ పేర్కొంది.

    వివరాలు 

    ఆరోపణలను ఖండించిన వినోద్ తావ్డే

    దానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    ''ఎన్నికల ప్రభావాన్ని కలిగించడానికి బీజేపీ డబ్బు పంచుతోంది. వీరి చర్యలు ఎన్నికల నియమాలను ఉల్లంఘించేవి. అందువల్ల ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి'' అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

    ఇప్పటికే బీజేపీ, వినోద్ తావ్డే ఈ ఆరోపణలను ఖండించారు. ఈ క్రమంలోనే, కాంగ్రెస్ అగ్రనేతలపై పరువునష్టం నోటీసులు పంపినట్లు తావ్డే పేర్కొన్నారు.

    తావ్డే మీడియాతో మాట్లాడుతూ,''నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ అలాంటి తప్పిదాలకు పాల్పడలేదు.కానీ కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా నా పరువును దెబ్బతీయాలని ప్రయత్నించారు.వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి,లేదంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఈ నోటీసులు పంపించాను'' అని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    మహారాష్ట్ర

    Ajinkya Rahane: బాంద్రాలో గ‌వాస్క‌ర్‌ స్థ‌లం స్వాధీనం.. అజింక్య ర‌హానేకు కేటాయింపు  ముంబై
    Talcum powder in antibiotics: ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ యాంటీబయాటిక్స్ సరఫరా.. మందుకు బదులు టాల్కం పౌడర్  భారతదేశం
    Ruta Awhad: 'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్‌ సతీమణి వ్యాఖ్యలపై దుమారం బీజేపీ
    Helicopter Crash: పుణే జిల్లాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మరణం పుణే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025