
Defamation Notice: ఖర్గే, రాహుల్ గాంధీ, శ్రీనేట్లకు రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge),అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కుశుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు అందాయి.
ఈ నోటీసులను బీజేపీ నేత వినోద్ తావ్డే(Vinod Tawde)ఆయనపై చేసిన ఆరోపణల కారణంగా పంపించారు. ఈ నోటీసుల్లో సుప్రియా శ్రినేట్ పేరు కూడా ఉన్నట్లు తెలియజేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Elections)ముందు అధికార,ప్రతిపక్షాల మధ్య తీవ్ర హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
పాల్ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్లో బీజేపీ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని బహుజన్ వికాస్ అఘాడీ(Bahujan Vikas Aghadi)పార్టీ ఆరోపించింది.
నాలసోపరా నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్కు మద్దతు ఇచ్చేలా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తోందని ఈ పార్టీ పేర్కొంది.
వివరాలు
ఆరోపణలను ఖండించిన వినోద్ తావ్డే
దానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
''ఎన్నికల ప్రభావాన్ని కలిగించడానికి బీజేపీ డబ్బు పంచుతోంది. వీరి చర్యలు ఎన్నికల నియమాలను ఉల్లంఘించేవి. అందువల్ల ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి'' అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఇప్పటికే బీజేపీ, వినోద్ తావ్డే ఈ ఆరోపణలను ఖండించారు. ఈ క్రమంలోనే, కాంగ్రెస్ అగ్రనేతలపై పరువునష్టం నోటీసులు పంపినట్లు తావ్డే పేర్కొన్నారు.
తావ్డే మీడియాతో మాట్లాడుతూ,''నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ అలాంటి తప్పిదాలకు పాల్పడలేదు.కానీ కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా నా పరువును దెబ్బతీయాలని ప్రయత్నించారు.వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి,లేదంటే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఈ నోటీసులు పంపించాను'' అని తెలిపారు.