Page Loader
Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు 
కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు

Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2024
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్‌ అలీ (52) సోమవారం శవంగా తేలారు. మృతుడు మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్‌ బవ సోదరుడు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. మంగళూరు పోలీసులు 12 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి, చివరికి ఫాల్గుణి నది ముఖద్వారం వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బీఎం ముంతాజ్‌ అలీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కుల్లూరు వంతెన సమీపంలో తన వాహనాన్ని పార్క్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Details

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

అలీ చివరి మాటలతో అప్రమత్తమైన అతడి కుమార్తె, పోలీసులను సంప్రదించడంతో అతడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. అతడిపై డబ్బుల కోసం బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేసిన ఆరోపణలపై ఒక మహిళతో సహా ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. మరణానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నగరంలోని ఏజే ఆస్పత్రికి తరలించారు. బీఎం ముంతాజ్‌ అలీ ప్రముఖ వ్యాపారవేత్తగా, మిస్బా గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ ఛైర్మన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.