NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు 
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు 
    కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు

    Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 07, 2024
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్‌ అలీ (52) సోమవారం శవంగా తేలారు. మృతుడు మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్‌ బవ సోదరుడు కావడం గమనార్హం.

    ప్రస్తుతం ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. మంగళూరు పోలీసులు 12 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టి, చివరికి ఫాల్గుణి నది ముఖద్వారం వద్ద మృతదేహాన్ని గుర్తించారు.

    బీఎం ముంతాజ్‌ అలీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఇంటి నుండి బయటకు వెళ్లారు.

    ఉదయం 5 గంటల ప్రాంతంలో కుల్లూరు వంతెన సమీపంలో తన వాహనాన్ని పార్క్ చేసినట్లు అధికారులు తెలిపారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు

    అలీ చివరి మాటలతో అప్రమత్తమైన అతడి కుమార్తె, పోలీసులను సంప్రదించడంతో అతడి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు.

    అతడిపై డబ్బుల కోసం బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేసిన ఆరోపణలపై ఒక మహిళతో సహా ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు.

    మరణానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నగరంలోని ఏజే ఆస్పత్రికి తరలించారు.

    బీఎం ముంతాజ్‌ అలీ ప్రముఖ వ్యాపారవేత్తగా, మిస్బా గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ ఛైర్మన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    బెంగళూరు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కర్ణాటక

    Karnataka Sex Scandal: కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ట్విస్ట్.. తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్న మహిళ  భారతదేశం
    Engagement Off: నిశ్చితార్థం ఆగిందన్న కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి.. భారతదేశం
    Prajwal Revanna: రేవన్న కేసులో పోలీసుల అదుపులో బిజెపి నేత  భారతదేశం
    Karnataka: హుబ్లీలో దారుణం.. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతిపై...  భారతదేశం

    బెంగళూరు

    Bengaluru :ఉద్యోగం కోల్పోయి దొంగగా మారిన బెంగళూరు టెక్కీ.. అరెస్ట్ భారతదేశం
    Zee layoffs: జీ టెక్నాలజీ ,ఇన్నోవేషన్ సెంటర్‌లో 50 శాతం మంది సిబ్బందిని తొలగింపు బిజినెస్
    Bangalore: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో మహిళ దారుణ హత్య హత్య
    Wipro New CEO and MD: విప్రోకు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా విప్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025