NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్
    క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్

    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతిపై మరింత దృష్టిసారిస్తూ, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి కీలకమైన నిర్ణయం తీసుకుంది.

    ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి సమీపంగా ఉన్న త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాలను రాజధాని పరిధిలోకి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ గ్రామాల్లో భూసేకరణ కోసం ఇటీవల గ్రామసభలు నిర్వహించగా, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి అంగీకరించారు.

    పెదలంక, చినలంక దీవులను ముందుగా పరిశీలించిన ప్రభుత్వం, వరద ముప్పు ఉన్న నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి పై గ్రామాలను ఎంపిక చేసింది.

    మూలపాడులో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉండటంతో, ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉందని అధికారులు భావిస్తున్నారు.

    Details

    క్రికెట్ స్టేడియం కోసం 2వేల ఎకరాల భూమి

    మూలపాడు నుంచే అమరావతికి గ్రాండ్ ఎంట్రెన్స్ వే నిర్మించాలని, అలాగే కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రతిపాదితంగా ఉంది.

    ఇక స్పోర్ట్స్ సిటీతోపాటు దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కూడా ప్లాన్ లో ఉంది. ఇందుకోసం 2,000 ఎకరాల భూమిని సేకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    ఈ నిర్మాణంపై అధ్యయనం చేయడానికి మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం ఇటీవల అహ్మదాబాద్లోని స్టేడియాన్ని పరిశీలించింది.

    అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని కూడా మూలపాడులో ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు, పాల్నాడు జిల్లాలో అమరావతి అవసరాల కోసం రెండో విడత భూసేకరణను ప్రభుత్వం ప్రారంభించింది.

    Details

    9,617.58 ఎకరాల భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం

    పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకారం తెలపగా, గ్రామసభలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.

    మొత్తంగా 9,617.58 ఎకరాల భూమిని సేకరించాలన్న ప్రభుత్వ యోజనలో భాగంగా రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

    వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించబడ్డాయి.

    రైతులు ప్రభుత్వం తమకు మేలు చేసే విధంగా అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

    ఐటీ సంస్థలు విశాఖపట్నం, పరిశ్రమలు శ్రీసిటీకే కేటాయిస్తున్నారని, అయితే అమరావతిలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే కంపెనీల వివరాలను వెల్లడించాలని కోరారు.

    Details

    స్పోర్ట్స్ సిటీ అభివృద్ధిపై పనులు వేగవంతం

    రైతులు తమ భూముల మూల్యం ఇచ్చే ప్లాట్లను రైల్వేస్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలని, ఏడాదికి రూ.60 వేలు కౌలు చెల్లించి, దానిని ఏటా 10 శాతం చొప్పున పెంచాలని కోరారు.

    పిల్లల చదువుల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా ప్లాట్లను తానఖా పెట్టుకునే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

    ప్రభుత్వం ఆలయ భూముల్లో కాకుండా రిజిస్టర్డ్ భూముల్లోనే ప్లాట్లు ఇవ్వాలని, రైల్వే ప్రాజెక్టులో తమ భూములు ఎక్కువగా తీసుకుంటున్నందున, రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

    రైతుల వినతులపై ప్రభుత్వం ఎలా స్పందించనున్నదో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి పనులు వేగం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం
    అమరావతి

    తాజా

    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్
    Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు అమృత్‌సర్
    Operation Sindoor: చండీగఢ్‌లోని వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి బెదిరింపు,మ్రోగిన సైరన్ ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్

    ఆంధ్రప్రదేశ్

    PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ భారతదేశం
    Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ  చంద్రబాబు నాయుడు
    Rain Alert: తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తెలంగాణ
    Summer Holidays: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త - ఈసారి వేసవి సెలవులు ఎక్కువే!  భారతదేశం

    ప్రభుత్వం

    Palle Panduga: నేటి నుంచి పల్లె పండుగ ప్రారంభం.. భూమి పూజలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    Gold: గోల్డ్ కొనేవారికి ప్రభుత్వం శుభవార్త.. గోల్డ్ బులియన్‌కి కొత్త రూల్స్ బంగారం
    Telangana: తెలంగాణలో ఎన్‌ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ.. ప్రభుత్వం అధికారిక ప్రకటన  తెలంగాణ
    AP : రహస్య జీవోలను బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్

    అమరావతి

    Ap Tourism :పర్యాటక రంగం అభివృద్ధిపై ఏపీ స్పెషల్ ఫోకస్.. రూ.500 కోట్లతో అమరావతిలో భారీ పర్యాటక ప్రాజెక్టు! భారతదేశం
    Amaravati: అయిదేళ్ల నిరీక్షణకు తెరపడింది.. అమరావతి టవర్ల పునాదుల పునః ప్రారంభం ఆంధ్రప్రదేశ్
    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులకు ఈసీ అనుమతి భారతదేశం
    Amaravati Brand Ambassador : రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. అర్హతలు, బాధ్యతలు ఏంటి? భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025