NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!
    తదుపరి వార్తా కథనం
    Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!
    నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!

    Yadagirigutta Brahmotsavam 2025 : నేటి నుంచి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల శోభ.. వాహన సేవల సమయాలివే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 01, 2025
    09:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి మార్చి 11వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.

    దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆలయ అధికారులు పూర్తిచేశారు.

    బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

    Details

     యాదాద్రి బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు 

    మార్చి 1 : మహావిష్ణువు సర్వసేనాధిపతి విష్వక్సేన ఆళ్వార్లకు తొలిపూజ నిర్వహించి, సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుపుతారు.

    మార్చి 2 : ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం

    మార్చి 3 : ఉదయం మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణాలు, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ

    మార్చి 4 : ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ

    మార్చి 5 : శ్రీ కృష్ణాలంకార సేవ నిర్వహించి, రాత్రి పొన్న వాహన సేవ నిర్వహించనున్నారు.

    మార్చి 7 : రాత్రి ఎదుర్కోలు వేడుక

    మార్చి 8 : రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం

    మార్చి 9 : రాత్రి 8 గంటలకు దివ్యవిమాన రథోత్సవం జరుగుతుంది.

    మార్చి 11 : గర్భాలయంలోని మూలవరులకు సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

    Details

    కొన్ని సేవలను రద్దు చేసిన అధికారులు

    వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయ అధికారులు కొన్ని సేవలను రద్దు చేశారు. ఇందులో కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చన సేవలు రద్దయ్యాయి.

    భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇటీవలే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం ఘనంగా జరిగింది.

    ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో ఈ మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు.

    వానమామలై మఠం పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజాదిక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాదాద్రి
    తెలంగాణ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    యాదాద్రి

    తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు తెలంగాణ
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే! భారతదేశం
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు  భారతదేశం

    తెలంగాణ

    Telangana: రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం.. తెలంగాణలో గరిష్ఠ స్థాయికి! విద్యుత్
    Uttam Kumar Reddy: జగన్‌తో స్నేహం కొనసాగిస్తూ తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు  భారతదేశం
    Hydra: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025