BSP:బీఎస్పీ మూడో జాబితా విడుదల..12 మంది అభ్యర్థుల పేర్ల ప్రకటన
2024 లోక్సభ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 12 మంది అభ్యర్థుల పేర్లను జాబితాలో చేర్చారు. ఇందులో మధుర అభ్యర్థిని మార్చారు. ఇక సురేష్ సింగ్ ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లక్నో బీజేపీ అభ్యర్థి,రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్పై మాయావతి సర్వర్ మాలిక్కు టికెట్ ఇచ్చారు. చాలా మంది అభ్యర్థుల టిక్కెట్లను కూడా పార్టీ రద్దు చేసింది.మధుర స్థానం నుంచి బీఎస్పీ తన అభ్యర్థిని మార్చింది.కమల్కాంత్ ఉప్మన్యు స్థానంలో సురేష్ సింగ్కు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. ఇది కాకుండా, మనీష్ త్రిపాఠి పూర్వాంచల్లోని మీర్జాపూర్ స్థానం నుండి బరిలోకి దిగారు.