NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Assembly: నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి 
    తదుపరి వార్తా కథనం
    AP Assembly: నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి 
    నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి

    AP Assembly: నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2024
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

    మొదటి రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు.

    అనంతరం రెండు సభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో BAC సమావేశం జరుగుతుంది.

    బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు.

    ఈ సమావేశానికి సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారు.

    చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలకు సమయం,కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ కోరే అవకాశం ఉంది. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.

    Details 

    శాసనమండలిలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల సంతాపతీర్మానం  

    సాధారణంగా, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వచ్చే ఆరు నెలల జీతాల చెల్లింపుతో సహా సాధారణ విషయాలపై డబ్బు ఖర్చు చేయడానికి అసెంబ్లీ ఆమోదం కోసం ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పిస్తారు.

    శాసనమండలిలో సభ్యులు సమావేశమై ,ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల సంతాపతీర్మానాన్ని ప్రవేశ పెడతారు.

    ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. అంతకమందు సంవత్సరం లాగే శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

    Details 

    బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశం

    అయితే ఈసారి బడ్జెట్‌లో రైతులకు రుణమాఫీ,రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొత్త ప్రకటనలు ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

    దానికి ముందు బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశం కానుంది.

    విభజన బిల్లును ఆమోదించిన తర్వాత బుధవారంతో సమావేశాలు ముగుస్తాయి. వివిధ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించేందుకు ప్రభుత్వం సవరణలు కూడా చేపట్టే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    తాజా

    AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ అనుమతి ఆంధ్రప్రదేశ్
    Anaganaga:ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న 'అనగనగా'.. స్ట్రీమింగ్‌లో అరుదైన రికార్డు టాలీవుడ్
    Abhishek Banerjee: యూసుఫ్ పఠాన్ ఔట్, అభిషేక్ బెనర్జీ ' ఇన్‌!.. ఆపరేషన్ సిందూర్' కోసం ఎంపిక తృణమూల్ కాంగ్రెస్‌
    Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం జమ్ముకశ్మీర్

    ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు

    Andhrapradesh: ఫిబ్రవరి 5 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు  బుగ్గన రాజేంద్రనాథ్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025