NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!
    తదుపరి వార్తా కథనం
    Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!
    లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!

    Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 21, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లెబనాన్‌లో హిజ్‌బొల్లా టార్గెట్‌గా జరిగిన పేజర్ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

    ఈ పేలుళ్ల కారణంగా 12 మంది మృతిచెందగా, వేల మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక భారతీయ వ్యక్తి సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు.

    కేరళలోని వయనాడ్‌కు చెందిన 'రిన్సన్ జోష్' అనే వ్యక్తి హిజ్‌బొల్లాకు పేజర్లు సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది.

    37 ఏళ్ల రిన్సన్ జోష్ బల్గేరియాలో స్థాపించిన తన కంపెనీ ద్వారా హిజ్‌బొల్లాకు పేజర్లు సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    Details

    రిన్సన్‌పై ప్రాథమిక విచారణ ప్రారంభం

    ఈ పేజర్లను ఇజ్రాయిల్ నిఘా సంస్థ మోసాద్ సరిదిద్దినట్లు ఆరోపణలొచ్చాయి.

    ఈ పేజర్లలో పేలుడు పదార్థాలు జోడించి, ఆ పేలుళ్లకు కారణమయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

    అయితే, బల్గేరియాలోని 'బీఏసీ కాన్సల్టింగ్ కేఎఫ్‌టీ' అనే కంపెనీకి సంబంధం ఉన్న ఆ పేజర్ల తయారీకి, ఈ పేలుళ్లకు సంబంధం లేదని బల్గేరియా భద్రతా సంస్థ డీఏఎన్ఎస్ స్పష్టం చేసింది.

    రిన్సన్ జోష్ ప్రస్తుతం నార్వే పౌరసత్వం కలిగి ఉన్నాడు. బల్గేరియా భద్రతా సంస్థ పేలుళ్ల గురించి దర్యాప్తు కొనసాగిస్తోంది.

    నార్వే రాజధాని ఓస్లో పోలీసులు రిన్సన్‌పై ప్రాథమిక విచారణ ప్రారంభించారు.

    Details

     ఐదేళ్లు డిజిటల్ కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేసిన రిన్సన్ జోష్

    రిన్సన్ జోష్, నార్వేలో తన భార్యతో ఉంటున్నట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

    గడచిన మూడు రోజులుగా అతను కాంటాక్ట్‌లో లేకపోవడంతో, అతన్ని టార్గెట్ చేసి, ఈ కేసులో ఇరికించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

    రిన్సన్ జోష్ కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం నార్వేకు వెళ్లాడు. లండన్‌లో కొంతకాలం పని చేసిన తరువాత, నార్వేకు తరలి వచ్చాడు.

    నార్వే ప్రెస్ గ్రూప్‌లో ఐదేళ్ల పాటు డిజిటల్ కస్టమర్ సపోర్ట్ విభాగంలో అతనికి పనిచేసిన అనుభవం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    లెబనాన్

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    కేరళ

    Lok Sabha 2024: రాహుల్‌ గాంధీతో వయనాడ్ లో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే? రాహుల్ గాంధీ
    Pinaray Vijayan: కేరళ ముఖ్యమంత్రి కుమార్తె వీణపై ఈడీ కేసు నమోదు  పినరయి విజయన్
    Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు  అరుణాచల్ ప్రదేశ్
    Kerala: కేరళలో అరుణాచల్‌ ప్రదేశ్‌ వలస కార్మికుడు దారుణ హత్య అరుణాచల్ ప్రదేశ్

    లెబనాన్

    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌కు లెబనాన్, సిరియా నుంచి మరో యుద్ధ ముప్పు.. సరిహద్దులో అలజడి  ఇజ్రాయెల్
    ఇరాన్ ఆదేశంతోనే లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా మిలిటెంట్ల దాడి: ఇజ్రాయెల్  ఇజ్రాయెల్
    గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు  హమాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025