Page Loader
6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష 
6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష

6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష 

వ్రాసిన వారు Stalin
Sep 05, 2023
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. జార్ఖండ్‌లోని డుమ్రి, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అయితే ఈ ఉప ఎన్నికలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ' 'ఇండియా' కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. దీంతో 'ఇండియా' కూటమికి ఈ ఉప ఎన్నికలు మొదటి పరీక్షగా విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలింగ్ జరుగుతున్న దృశ్యం