NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..?
    మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..?

    #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 25, 2025
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా వెలుగొందుతున్న మైసూర్ శాండల్ సోప్‌కు తాజాగా నటి తమన్నా భాటియాను తన కొత్త బ్రాండ్ అంబాసడర్‌గా నియమించింది.

    ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించింది. అయితే ఈ ప్రకటనతో పాటు కొత్త వివాదానికి తెరలెత్తింది.

    కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటులు, సామాజిక మాధ్యమాల్లోని వినియోగదారులు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    దక్షిణాదిలో, ముఖ్యంగా కర్ణాటకలో అనేక ప్రతిభావంతులైన నటీమణులు ఉన్నప్పటికీ, బయటి నటిని ప్రాధాన్యమివ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

    Details

    దక్షిణ భారతదేశంలో బ్రాండ్ స్థానం 

    ఈ సబ్బును కర్ణాటక ప్రభుత్వంలోని 'కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్' (KSDL) తయారు చేస్తోంది.

    దేశవ్యాప్తంగా విస్తరణ లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

    ఇప్పటికే 480 మందికి పైగా కొత్త పంపిణీదారులను జోడించగా, జమ్ముకశ్మీర్, నాగాలాండ్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.

    అత్యుత్తమ ఆర్థిక ఫలితాలు

    2023-24 ఆర్థిక సంవత్సరంలో, KSDL రూ. 1,500 కోట్ల రికార్డు టర్నోవర్‌ను సాధించింది. 40 ఏళ్లలో ఇదే అత్యధిక పనితీరుగా సంస్థ ప్రకటించింది.

    మైసూర్ శాండల్ సబ్బుతో పాటు సంస్థ ఇతర శుభ్రపరిచే ఉత్పత్తులు, అగరుబత్తులు కూడా విక్రయిస్తోంది. కానీ, మైసూర్ శాండల్ సోప్ తన ప్రత్యేకత, ఆదరణను కొనసాగిస్తోంది.

    Details

    సబ్బు ప్రత్యేకత - 100% స్వచ్ఛ గంధపు నూనె

    ఈ సబ్బును ప్రత్యేకంగా నిలిపే అంశం దీంట్లో వాడిన 100% స్వచ్ఛమైన గంధపు నూనె. ఇది ప్రపంచంలో ఎలాంటి కృత్రిమ సువాసనలు లేని ఏకైక సబ్బుగా గుర్తింపు పొందింది.

    దీని సహజ గంధపు సుగంధం ఎక్కువ కాలం పాటు నిలుస్తుందనే విశ్వాసం ఉంది. చర్మానికి మేలు చేయడమే కాకుండా, ఇది భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించడంలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

    ఇది భారతదేశంలో భౌగోళిక సూచిక (GI Tag) పొందిన మొట్టమొదటి సబ్బు కావడం గర్వకారణంగా మారింది.

    ఇతర నటీమణులకు అవకాశమివ్వకుండా తమన్నాను ఎంపిక చేసినందుకు అభ్యంతరాలు ఉన్నా, బ్రాండ్ పరంగా వ్యాపార విస్తరణ దృష్టితో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా ఇది భావించవచ్చు.

    స్థానిక కంటెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్‌కి కూడా బలం పెరుగుతున్నది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..? భారతదేశం
    Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల గుజరాత్
    Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్‌.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి! సునీల్ గవాస్కర్
    Sardar 2 : కార్తీ బర్త్‌డే బ్లాస్ట్.. 'సర్దార్ 2' నుండి మాస్ పోస్టర్ విడుదల! టాలీవుడ్

    భారతదేశం

    FATF: 'రుజువు ఉందా, చర్య తీసుకుంటాం': పాకిస్తాన్‌ను FATFలో ఉంచడానికి భారత్ కృషి భారతదేశం
    IMF Report: నాల్గో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఇండియా.. ఐఎంఎఫ్ షాకింగ్ రిపోర్ట్ బిజినెస్
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'.. పేరులోనే బలమైన సందేశం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025