Page Loader
Chidambaram: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ తోపాటు మూడు క్రిమినల్‌ చట్టాలను రద్దు 
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ తోపాటు మూడు క్రిమినల్‌ చట్టాలను రద్దు

Chidambaram: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ తోపాటు మూడు క్రిమినల్‌ చట్టాలను రద్దు 

వ్రాసిన వారు Stalin
Apr 21, 2024
09:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రంలో ఇండియా కూటమి(India Alliance)అధికారంలోకి వస్తే సీఏఏ (CAA)తో పాటు మూడు క్రిమినల్‌ చట్టాలను కూడా రద్దు చేస్తామని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ నిచ్చారు. ఫార్మర్స్‌ ప్రొడ్యూస్, ట్రేడ్, అండర్‌ కామర్స్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఫెసిలిటేషన్‌ యాక్‌ ్ట- 2020, భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్షా యాక్ట్‌ వంటి చట్టాలను కూడా రద్దు లేదా సవరించడం గానీ చేస్తామని చిదంబరం చెప్పారు. బెయిల్‌ రూల్‌ మినహాయింపు అనే సూత్రాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

Details 

65 శాతంమంది విచారణ ఖైదీలే..

కేరళకు చెందిన జస్టిస్‌ కృష్ణ ఈ చట్టం గురించి చాలా బాగా వివరించారని తెలిపారు. అందరూ బెయిల్‌ పొందేందుకు సుప్రీంకోర్టు మెట్లెక్కలేరని, దిగువ న్యాయవ్యవస్థ, మేజిస్ట్రేట్, జిల్లా న్యాయమూర్తులలో ఈ నియమాన్ని చాలా తక్కువగా పాటిస్తారని చెప్పారు. జైలులో ఉండేవారంతా దోషులు కాదని, వారిలో 65 శాతంమంది విచారణ ఖైదీలే ఉన్నారని తెలిపారు. 90 శాతం మంది అండర్‌ ట్రయల్స్‌ లో ఉన్న ఖైదీలంతా ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే తాము ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. సీబీఐ, పోలీసుల 15 రోజుల విచారణ తర్వాత ప్రతి ఒక్కరూ బెయిల్‌ పొందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.