NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే 
    తదుపరి వార్తా కథనం
    Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే 
    Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే

    Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 19, 2024
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలోని అన్ని కులాలను లెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి సమగ్ర కుల గణనను ప్రారంభించనుంది.

    ఏపీలో 6 జిల్లాల పరిధిలోని 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింది కులగణన ఇప్పటికే విజయవంతంగా నిర్వహించారు.

    నేటి నుండి ప్రారంభం కానున్నఈ కులగణన ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది.

    ఆన్‌లైన్‌లో కులగణన వివరాలు వివరాలు సేకరించాలి,ఒక వేళ మారుమూల పల్లెల్లో గాని,సిగ్నల్ లేని ప్రాంతాల్లో గాని అయితే ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు.

    గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది,ఎన్యుమరేటర్లు కులగణన కోసం ఈ రోజు నుండి జనవరి 28 మధ్య ఇంటింటికీ వెళతారు.

    Details 

    ప్రత్యేక యాప్‌లో సర్వే వివరాలు

    జనాభా గణన సమయంలో ఇళ్లలో అందుబాటులో లేనివారు,ఇంటింటి ప్రక్రియలో పాల్గొనలేని వారు, తమ కుల సమాచారాన్ని గ్రామ,వార్డు సచివాలయాలలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 2, 2024 వరకు నమోదు చేసుకోవచ్చు.

    ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సర్వే వివరాలు నమోదు చేస్తారు.. ఒకవేళ గణన సమయంలో ఏదైనా తప్పు తలెత్తే సమస్యల సత్వర పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వద్ద సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు.

    ఫిబ్రవరి 15 నాటికి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో తుది కుల గణన నివేదికను సిద్ధం చేస్తారు.

    Details 

    కులాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం 

    స్వాతంత్య్రానంతరం భారతదేశంలో కుల గణన జరగలేదని, కేవలం జనాభా గణన మాత్రమే జరుగుతుందని సమాచార, పౌరసంబంధాల (I & PR) మంత్రి సి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అంతకుముందు అన్నారు.

    కుల గణనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించింది.

    కుల గణనను నిష్పక్షపాతంగా, సమగ్రంగా నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ తన గణన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా ప్రదర్శించాలనుకుంటోంది.

    జనాభా గణనలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు స్వచ్ఛంద వ్యవస్థను విస్తృతంగా అమలు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా

    ఆంధ్రప్రదేశ్

    Murder:నంద్యాలలో దారుణం.. గొంతు కోసం రిటైర్డ్ టీచర్ దారుణ హత్య నంద్యాల
    Ananthapur accident: అనంతపురంలో బస్సు-ట్రాక్టర్ ఢీ.. నలుగురు మృతి  అనంతపురం అర్బన్
    JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే.. తాజా వార్తలు
    Chandrababu-Prashant kishor: ఏపీలో షాక్‌లో వైసీపీ.. చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025