NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ
    భారతదేశం

    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ

    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 30, 2022, 02:42 pm 0 నిమి చదవండి
    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ
    నకిలీ డాక్టర్లపై సీబీఐ ఫోకస్

    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో దేశవ్యప్తంగా 73మంది అర్హత లేని వైద్యులు ప్రాక్టీసు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఉన్నారు. నకిలీ ఎఫ్‌ఎంజీఈ సర్టికెట్లతో ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లలో ఈ 73మంది రిజిస్టర్ చేయించుకున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 14రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

    ఎఫ్‌ఎంజీఈ ఉత్తీర్ణత సాధించకుండానే రిజిస్ట్రషన్..

    విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి తిరిగి వచ్చినవారు తప్పనిసరిగా ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షలు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణణ సాధిస్తేనే.. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కానీ.. రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్లు కానీ.. రిజిస్ట్రేషన్‌ నెంబర్లు ఇస్తాయి. ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించని కొందరు.. నకిలీ పత్రాలను సృష్టించిన రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నట్లు సీబీఐ దృష్టికి రావడంతో ఈ ఆపరేషన్ నిర్వహించింది. దీంతో స్కామ్ బయటపడింది. తెలుగు రాష్ట్రాలో గుర్తించిన ఆరుగురు నకిలీ వైద్యుల్లో రాకేష్‌కుమార్(కాజీపేట), శ్రీనివాసరావు(చేవెళ్ల), మహ్మద్ ఫసియుద్దీన్(వరంగల్‌), హరికృష్ణారెడ్డి(లింగంపల్లి), మరుపిళ్ల శరత్‌బాబు(విజయవాడ), రాజవంశీ(విశాఖపట్నం) ఉన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    ఆంధ్రప్రదేశ్

    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఉద్యోగం
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఉద్యోగం

    తెలంగాణ

    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ హైదరాబాద్
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం కరీంనగర్
    'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023