NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ
    నకిలీ డాక్టర్లపై సీబీఐ ఫోకస్

    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ

    వ్రాసిన వారు Stalin
    Dec 30, 2022
    02:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది.

    ఈ సోదాల్లో దేశవ్యప్తంగా 73మంది అర్హత లేని వైద్యులు ప్రాక్టీసు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఉన్నారు.

    నకిలీ ఎఫ్‌ఎంజీఈ సర్టికెట్లతో ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లలో ఈ 73మంది రిజిస్టర్ చేయించుకున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 14రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

    సీబీఐ

    ఎఫ్‌ఎంజీఈ ఉత్తీర్ణత సాధించకుండానే రిజిస్ట్రషన్..

    విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి తిరిగి వచ్చినవారు తప్పనిసరిగా ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షలు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ) నిర్వహిస్తుంది.

    ఈ పరీక్షలో ఉత్తీర్ణణ సాధిస్తేనే.. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కానీ.. రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్లు కానీ.. రిజిస్ట్రేషన్‌ నెంబర్లు ఇస్తాయి. ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించని కొందరు.. నకిలీ పత్రాలను సృష్టించిన రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నట్లు సీబీఐ దృష్టికి రావడంతో ఈ ఆపరేషన్ నిర్వహించింది. దీంతో స్కామ్ బయటపడింది.

    తెలుగు రాష్ట్రాలో గుర్తించిన ఆరుగురు నకిలీ వైద్యుల్లో రాకేష్‌కుమార్(కాజీపేట), శ్రీనివాసరావు(చేవెళ్ల), మహ్మద్ ఫసియుద్దీన్(వరంగల్‌), హరికృష్ణారెడ్డి(లింగంపల్లి), మరుపిళ్ల శరత్‌బాబు(విజయవాడ), రాజవంశీ(విశాఖపట్నం) ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? చంద్రబాబు నాయుడు
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు
    2022లో మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులు ఇవే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025