NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును  ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును  ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం 
    సీబీఐకి రాష్ట్ర కేసుల దర్యాప్తును  ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం

    MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును  ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 26, 2024
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    రాష్ట్రంలో కేసుల విచారణ కోసం సీబీఐకి అనుమతి ఉపసంహరించాలని నిర్ణయించింది.

    ఈ కుంభకోణం చుట్టూ వాస్తవాలు వెలుగులోకి రాలన్న డిమాండ్ల మధ్య ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

    వివరాలు 

    గవర్నర్ అడిగిన ఎలాంటి సమాచారం అందించకూడదు.. కర్ణాటక కేబినెట్ ఆదేశాలు

    "రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నాం.వారు తమ అధికారాలను దుర్వినియోగం చేయవచ్చని మాకు ఆందోళన ఉంది.వారిది పక్షపాత వైఖరి,దీనికి ముడా స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదు. మేము సీబీఐకి నియమించిన అన్ని కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయలేదు, ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మేము సీబీఐకి సూచించిన కేసులను వారు తిరస్కరించిన అనేక సందర్భాలు ఉన్నాయి. సీబీఐ తప్పుడు మార్గంలో పడకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాతో అన్నారు.

    ఇంకా, తన అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన ఎలాంటి సమాచారం అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కర్ణాటక కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది.

    వివరాలు 

    కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేసిందనే విమర్శలు 

    అనుమతి నిరాకరించిన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి, అయితే అవన్నీ విపక్ష పార్టీల పాలనలో ఉన్నాయి.

    ఈ రీతిలో అనుమతిని నిరాకరించిన రాష్ట్రాలలో ఏదైనా కేసును సీబీఐ విచారించాల్సి వస్తే, దానికి సంబంధించి సదరు ప్రభుత్వం రాతపూర్వక అనుమతి అవసరం.

    బెంగాల్‌లో ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనలో సీబీఐ దర్యాప్తు కూడా ఆ కోవలోనే ఉంది.

    మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా కర్ణాటక మాదిరిగా అనుమతి ఉపసంహరించుకుంది.

    తమిళనాడు (డీఎంకే), కేరళ (వామపక్షకూటమి) వంటి రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

    ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేసిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

    వివరాలు 

    సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశం 

    ఇంకా, ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందటం, ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

    ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.

    వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు.

    ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా,దానిని గవర్నర్ తోసిపుచ్చారు.తద్వారా, సీఎం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం రాలేదు.

    ఈ భూకుంభకోణం సమగ్ర దర్యాప్తులో భాగంగా సిద్ధూను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం చట్టబద్ధమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

    అలాగే,కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

    ఈ పరిస్థితుల్లో సిద్దరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సమయంలో తాజా నిర్ణయం వెలువడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    సిద్ధరామయ్య
    సీబీఐ

    తాజా

    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి
    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం
    Visa: అమెరికా వీసా కోసం 13 నెలల వరకు నిరీక్షణ.. భారతీయ దరఖాస్తుదారులకు తలనొప్పి! అమెరికా

    కర్ణాటక

    Prajwal Revanna-Devegouda-Sex Videos: మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కుటుంబసభ్యులు, మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదు లోక్‌సభ
    Prajwal Revanna-Sex Scandal-Suspended: దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ నుంచి సస్పెండ్ భారతదేశం
    Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్  భారతదేశం
    Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్‌ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు  జేపీ నడ్డా

    సిద్ధరామయ్య

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య కర్ణాటక
    సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం  డీకే శివకుమార్
    కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం కర్ణాటక

    సీబీఐ

    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  ఒడిశా
    వైఎస్‌ వివేకా హత్య కేసు: కలర్ జిరాక్స్ కాపీతో నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ వైఎస్సార్ కడప
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్ ఆంధ్రప్రదేశ్
    గాలి జనార్దన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ..82 ఆస్తుల జప్తునకు సీబీఐ కోర్టు ఆదేశం కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025