NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్
    తదుపరి వార్తా కథనం
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్
    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్

    వివేకా కేసులో అవినాష్ రెడ్డే A-8 నిందితుడు : కోర్టులో సీబీఐ కౌంటర్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 08, 2023
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా దారుణ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎక్కడా నిందితుడిగా పేర్కొనలేదు.

    కానీ ఫస్ట్ టైమ్ ఆయన్ను A-8 నేరస్థుడని కోర్టుకు తెలిపింది. తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థ కౌంటర్ దాఖలు చేసింది.

    దీంట్లో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా పేర్కొంటూ జాబితా సిద్ధం చేసింది. హత్యకు కుట్ర, ఆధారాల ధ్వంసంలో ఈ ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించారని కౌంటర్ లో స్పష్టం చేసింది.

    ఈ నేపథ్యంలోనే అతని తండ్రి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే పులివెందులతో పాటు మొత్తం దర్యాప్తు ప్రక్రియనే ప్రభావితం చేయగలరని వివరించింది.

    Details

    అప్పుడే అతని అనుచరులు వీరంగం సృష్టించారు : సీబీఐ

    అరెస్ట్ చేసినప్పుడే ధర్నాలు చేశారు : సీబీఐ

    భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన క్రమంలో అతని అనుచరులు వీరంగం సృష్టించారని, ధర్నాలు, రాస్తారోకోలు చేశారని కౌంటర్ లో సీబీఐ పేర్కొంది. అలాంటిది ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని స్పష్టం చేసింది.

    భాస్కర్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నట్టే చెబుతారు కానీ అవన్నీ అసత్యాలేనన్నారు. వివేకా మృతదేహానికి పంచనామా వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్ రెడ్డిలు హుకుం జారీ చేశారన్నారు.

    దర్యాప్తు సంస్థ సీబీఐకి సహా న్యాయస్థానానికి ఎలాంటి వివరాలు చెప్పొద్దని దస్తగిరిని సైతం ప్రలోభాలకు గురిచేశారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో దాగి ఉన్న భారీ కుట్రపై దర్యాప్తు చేసి చేధిస్తామని స్పష్టం చేసింది.

    Details

    వైఎస్ సునీత ఇంప్లీడ్ పిటిషన్ కు న్యాయమూర్తి అంగీకారం

    ఆరోగ్యం బాగాలేదని, బెయిలివ్వాలని వాదనలు

    భాస్కర్ రెడ్డి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు వాదించారు.

    ఇదే కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానం మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను ఆయన ఉదహారించారు.

    సమాజంలో భాస్కర్ రెడ్డికి మంచి పలుకబడి ఉందని, అంతకుమించి ఓ సీనియర్ సిటిజన్‌ అని వాదించిన న్యాయవాది , ఆయన్ను నేరస్థుడిగా బలపర్చే సాక్ష్యాలు ఎక్కడా లేవన్నారు.

    మరోవైపు వైఎస్ సునీత దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీబీఐ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    ఆంధ్రప్రదేశ్

    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు తుపాను
    అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం; ఎలక్షన్ గుర్తు కోసం పార్టీలకు ఈసీ ఆహ్వానం  ఎన్నికల సంఘం
    ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ ప్రోగ్రామ్; ఈ ఏడాది నుంచే అమలు విద్యా శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్: జీఓ 1ని కొట్టివేసిన హైకోర్టు హైకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025