Divya Pahuja: గురుగ్రామ్ హోటల్లో మాజీ మోడల్ దివ్య పహుజా హత్య
గురుగ్రామ్లోని ఓ హోటల్లో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. దివ్య పహుజా అనే బాధితురాలిని సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజీత్ సింగ్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. హోటల్ యజమాని అభిజీత్ తన సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డారని, ఆపై దివ్య మృతదేహాన్ని పారవేయడానికి అతని సహచరులకు రూ.10 లక్షలు చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అభిజీత్తో సహా హత్య నిందితులు దివ్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి నీలిరంగు బిఎమ్డబ్ల్యూ కారులోకి ఎక్కించి ఘటనా స్థలం నుంచి పారిపోవడం కనిపించింది.
దివ్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
జనవరి 2న హోటల్ రిసెప్షన్కు అభిజీత్, యువతి, మరొక వ్యక్తి వచ్చి గది నంబర్ 111కి వెళుతున్న దృశ్యం మొత్తం సిసిటివి కెమెరాలలో రికార్డు అయ్యింది. ఆ తర్వాత అదే రాత్రి అభిజీత్తో పాటు మరికొందరు దివ్య మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లాగడం కనిపించింది. గురుగ్రామ్ పోలీసులు, సిసిటివి ఫుటేజీ ఆధారంగా, హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ బ్రాంచ్కు చెందిన అనేక బృందాలు పంజాబ్, ఇతర ప్రాంతాలలో నిందితులను అరెస్టు చేయడానికి దాడులు నిర్వహిస్తున్నాయి. దివ్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అభిజీత్తో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు.