NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Flight Bomb Threats: 'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు
    తదుపరి వార్తా కథనం
    Flight Bomb Threats: 'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు
    'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు

    Flight Bomb Threats: 'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 23, 2024
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత విమానయాన రంగంలో ఇటీవల బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి.

    ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా వంటి ప్రధాన విమాన సంస్థలకు గత వారం నుంచి 100కు పైగా విమానాలకు ఈ బెదిరింపులు అందాయి.

    అంతర్జాతీయ, దేశీయ విమానాలకు ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక బెదిరింపులు ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చాయని అధికారులు గుర్తించారు.

    ఈ పరిణామాలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. వర్చువల్ సమావేశంలో ఎయిర్‌లైన్స్, ఎక్స్, మెటా వంటి సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

    Details

    నోఫ్లై లిస్టులో పెడతామని హెచ్చరిక

    జాయింట్ సెక్రటరీ సంకేత్ ఎస్ భోంద్వే ఎక్స్ (ట్విట్టర్) పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితిని 'ఎక్స్ ప్రేరేపిత నేరం'గా అభివర్ణించారు.

    పుకార్లను నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

    120కి పైగా విమానాలు ఈ బెదిరింపులకు గురవడం వల్ల చాలా విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రభుత్వం ప్రయాణికుల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

    నకిలీ బెదిరింపులకు పాల్పడేవారిని 'నోఫ్లై' లిస్టులో పెడతామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాంబు బెదిరింపు
    ఎక్స్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    బాంబు బెదిరింపు

    Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు  భారతదేశం
    Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత  భారతదేశం
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బెంగళూరు
    Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..   తమిళనాడు

    ఎక్స్

    జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత  ఎలాన్ మస్క్
    ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే?  ట్విట్టర్
    Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్ ఎలాన్ మస్క్
    ఎక్స్ లో కీలక మార్పు: ఇకపై రిప్లయ్ ఇచ్చే అవకాశమూ పోయినట్టే!  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025