
ఆన్లైన్లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలపై విధాన రూపకల్పనకు కొంత సమయం ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది.
ఈ సమస్య అనేది చాలా క్లిష్టమైనదని, ఔషధాల విక్రయ విధానంలో ఏదైనా తేడా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో విధానాన్ని రూపొందించడానికి చివరి అవకాశంగా హైకోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మరో నాలుగు నెలల సమయం ఇచ్చింది.
తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఆ తేదీలోపు ముసాయిదా విధానాన్ని కేంద్రం సిద్ధం చేయకపోతే.. ఈ కేసును కొనసాగించడం మినహా ఈ కోర్టుకు వేరే మార్గం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జులై 8కి విచారణ వాయిదా
The Centre has urged the Delhi High Court to grant some time to frame a policy on the online sale of medicines on the grounds that the issue was "complex" and any modification in the manner of sale of drugs would have far-reaching consequences. https://t.co/Ffz7leQ0TA
— businessline (@businessline) March 17, 2024