NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే
    తదుపరి వార్తా కథనం
    Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే
    ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే

    Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2024
    01:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

    ఎన్నికల కమిషన్ నిబంధనల్లో మార్పుల ద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తగ్గించడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

    ఎన్నికల కమిషన్ స్వతంత్రతను నాశనం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడికి సమానమని ఖర్గే అన్నారు.

    మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను నిర్వీర్యం చేయడానికి ముందుగా ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది.

    ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగే అక్రమాలు బయటకు రాకుండా సీసీ టీవీ ఫుటేజ్, అభ్యర్థుల రికార్డుల తనిఖీని నిషేధిస్తోంది.

    Details

    నిర్ణయంపై న్యాయపరంగా సవాల్ చేస్తాం

    ఇది ఎన్నికల కమిషన్ సమగ్రతకు పెద్ద దెబ్బ అని, ఈవీఎంల పారదర్శకత లోపం వంటి సమస్యలపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించలేదన్నారు.

    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్పులు చేస్తోందని ఆరోపించారు.

    ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేస్తామని ప్రకటించారు.

    కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిన ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనలు సవరించడం విడ్డూరమని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారవచ్చని జైరాం రమేశ్ అన్నారు.

    ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్‌ 93(2)(ఏ)ను సవరించినట్లు కేంద్ర న్యాయశాఖ తెలిపింది.

    పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజ్ తనిఖీ వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించినట్లు స్పష్టంచేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లికార్జున ఖర్గే
    కాంగ్రెస్

    తాజా

    Pakistan: 5,000 మందికి పైగా పాకిస్తానీ యాచకులను బహిష్కరించిన సౌదీ అరేబియా  పాకిస్థాన్
    Raj Nidimoru and Samantha: రాజ్ నిడిమోర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సమంత టీమ్ క్లారిటీ! సమంత
    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ

    మల్లికార్జున ఖర్గే

    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే బెంగళూరు
    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్

    కాంగ్రెస్

    Natwar Singh : కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత దిల్లీ
    Raithu Runamafi: రేపు మూడో విడత రుణమాఫీ.. 14 లక్షల మందికి లబ్ధి రేవంత్ రెడ్డి
    Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ కర్ణాటక
    Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025