LOADING...
International Yoga Day: కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం 
కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం

International Yoga Day: కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) ఈసారి 11వ ఎడిషన్‌ జరుపుకోనుండగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో విశేషమైన స్థానాన్ని విశాఖపట్నం పొందుతోంది. తొలిసారిగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆతిథ్యమిస్తున్న ఈ నగరం ఈ మేరకు ప్రత్యేకంగా సిద్దమవుతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాట్లను సమీక్షిస్తూ, వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో విశేషంగా కసరత్తు చేస్తున్నారు.

Details

ప్రధాన మంత్రి పిలుపు మేరకు యోగా ప్రజలకందించే ప్రయత్నం

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగాను సామూహిక ఉద్యమంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసి, విశాఖలో చేపట్టిన ఏర్పాట్లను వెల్లడించింది. సమీక్షలో కీలక పాత్రధారులు ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్, జాయింట్‌ సెక్రటరీ మోనాలిసా డాష్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిరా ప్రసాద్, ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, ఆయుష్, వీఎంఆర్డీఏ వంటి శాఖల అధికారులు

Details

సమన్వయంతో వేడుకలకు ప్రణాళిక

ఈ సమీక్షలో పాల్గొని ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, ఆంధ్రా యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ వేదికలుగా పరిశీలించారు. ఈ ప్రదేశాలు యోగా ప్రదర్శనలు, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య కార్యక్రమాలకు కేంద్రాలుగా ఉంటాయి. వివిధ శాఖల సమన్వయం, భద్రతా ఏర్పాట్లు, ప్రజలను భారీగా సమీకరించే వ్యూహాలపై సమీక్ష జరిగింది. మౌలిక సదుపాయాల కల్పన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. యోగా సంస్థలు, సమాజాలను కలిపి కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా కార్యాచరణ కొనసాగుతోంది.

Advertisement

Details

ప్రత్యేక ఆకర్షణ - "యోగాంధ్ర"

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ఈ వేడుకలకు ప్రధాన బలంగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా యోగాను రోజువారీ అలవాటుగా మార్చడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో భాగంగా: సామూహిక అవగాహన కార్యక్రమాలు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో యోగా శిబిరాలు 20 లక్షల ధృవీకరించిన యోగా అభ్యాసకుల తయారీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ప్రదేశాల్లో వేడుకలు విశాఖలోనే ఐదు లక్షల మంది పాల్గొనే అవకాశం

Advertisement

Details

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రశంస

రాష్ట్రం చేపట్టిన చర్యలు, ప్రజల స్థాయిలో భాగస్వామ్యం భారత్‌ యోగా సంప్రదాయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభినందించింది. ఆంధ్రప్రదేశ్ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింత విశేషంగా మారనుందని స్పష్టం చేసింది. ఈ వేడుకలు యోగాను ప్రజల జీవితంలో భాగంగా మార్చేందుకు ఒక దశగా నిలవనున్నాయి.

Advertisement