NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన 
    తదుపరి వార్తా కథనం
    Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన 
    వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన

    Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటన 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

    రాష్ట్రంలో 1.8 లక్షల హెక్టార్ల పంట నష్టపోయిందని, 2 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారని ఆయన తెలిపారు.

    నిపుణుల బృందాలు నష్టాన్ని అధ్యయనం చేస్తున్నాయని, తక్షణ,దీర్ఘకాలిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

    ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శితో కలిసి రాష్ట్రాన్ని సందర్శించిన మంత్రి, ప్రభుత్వం వేగంగా స్పందించకపోతే ప్రాణ నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అన్నారు.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పనిచేస్తూ వరద బాధితులను రక్షించడంలో అపార కృషి చేస్తోందని కొనియాడారు.

    వివరాలు 

     ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వాయుసేన, నౌకాదళం సహకారం 

    భారీ వర్షాలు, వరదల వల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని, నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని వివరించారు.

    డ్రోన్ల సహాయంతో పాలు, మంచినీళ్లు, ఆహారం అందించడం ఇక్కడే మొదటిసారి చూస్తున్నానని అన్నారు.

    కేంద్రం పంపిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వాయుసేన, నౌకాదళం సహకారం అందిస్తున్నాయన్నారు.

    విజయవాడ కలెక్టరేట్‌లో జరిగిన ఫొటో ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

    విపత్తు కారణంగా జరిగిన నష్టాన్ని చంద్రబాబు వివరించి, కేంద్ర సాయం కోరారు.

    బుడమేరుకు సమీపంలో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాల కారణంగా వరద ముంపు తీవ్రత పెరిగిందని, దీన్ని నివారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

    వివరాలు 

    బుడమేరు గండి పూడ్చేందుకు సైన్యం నుంచి ప్రత్యేక బృందాలు

    అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. "వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు సమీపంలో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఇది బుడమేరు గండి పడటానికి ప్రధాన కారణం. ఈ ప్రాంతాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు సానుకూల, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. బుడమేరు గండి పూడ్చేందుకు సైన్యం నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ డిశ్ఛార్జి సామర్థ్యాన్ని పెంచడం కోసం కేంద్రం నిపుణుల బృందం నివేదిక ఆధారంగా స్పందిస్తాం. భారీ వర్షాలు,వరదలు వల్ల అపార నష్టం జరిగింది. అనేక ప్రాంతాలు ఐదు రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి. ఆ నీళ్లలో జరిగిన నష్టాన్ని గమనించాము" అని వివరించారు.

    వివరాలు 

     పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు 

    "రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో 24 గంటల పాటు కృషి చేస్తోంది. ఈ సందర్భంగా, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.బాధితుల సాయం కోసం అవసరమైన పాలు, నీళ్లు, ఆహారం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. మేము ప్రత్యేక బృందాన్ని నియమించి, బాధితులకు అవసరమైన వనరులు అందుతున్నాయా అన్నది నిర్ధారించుకుంటున్నాము. సీఎం స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, పారిశుద్ధ్య పనులు, ఇళ్లలో పేరుకున్న బురదను తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. చనిపోయిన పశువుల కళేబరాలను తొలగించడం, నష్టాన్ని అంచనా వేయడం కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి" అని కేంద్ర మంత్రి వివరించారు.

    వివరాలు 

    ఆక్వా రంగానికి నష్టం

    "గత వైసీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది" అని చౌహాన్ తెలిపారు.

    ప్రస్తుతం, ఎన్డీయే ప్రభుత్వం ప్రీమియం చెల్లించడంతో, రైతులకు బీమా సాయం అందునట్లుగా చెప్పారు.

    "భారీ వర్షాలు, వరదల కారణంగా 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దీని వల్ల 2.05 లక్షల మంది రైతులు రూ.1,056 కోట్లు నష్టపోయారు. 12 జిల్లాల్లో 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో 30,154 మంది రైతులు నష్టపోయారు. భారీ వర్షాలు 3,756 కిమీ మేర రోడ్లకు నష్టం కలిగించాయి. ఆక్వా రంగానికి కూడా నష్టం ఏర్పడింది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శివరాజ్ సింగ్ చౌహాన్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    శివరాజ్ సింగ్ చౌహాన్

    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు మధ్యప్రదేశ్
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య మధ్యప్రదేశ్
    ఇరకాటంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. 50 శాతం కమిషన్ ఫోన్ పే చేయాలంటూ వాల్ పోస్టర్లు మధ్యప్రదేశ్
    గిరిజన కూలీపై మూత్ర విసర్జన; నిందితుడు బీజేపీ వ్యక్తి అంటూ ప్రతిపక్షాల ఆరోపణ  మధ్యప్రదేశ్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Naidu :చంద్రబాబు భావోద్వేగం ..మళ్లీ జన్మ ఉంటే.. కుప్పంలో పుడతా భారతదేశం
    Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు  ఆంధ్రప్రదేశ్
    Chandrababu Naidu: ఏపీలో పింఛనుదారులకు శుభవార్త ..3నుండి 4వేలు పెంపు ఆంధ్రప్రదేశ్
    Days After Oath: చంద్రబాబు, రేవంత్ పెండింగ్ సమస్యలపై కీలక భేటీ  రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025