NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం
    శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం

    అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 21, 2023
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాలను భక్తిశ్రద్ధలతో ధరిస్తారు. నియమ, నిష్ఠలతో పూజలు చేస్తారు. స్వామి దర్శనం కోసం ఎంత దూరం నుంచైనా శబరిమలకు తరలివెళ్తుంటారు.

    రోడ్డు, రైలు సహా వాయు మార్గాల్లోనూ శబరికి వెళ్తారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు సహా సుదూర ప్రయాణానికి ఇబ్బంది పడేవారు, సమయం తక్కువ ఉన్నవారు విమానాలనే ఆశ్రయిస్తారు.

    అయితే శబరిమలలో విమానాశ్రయం కట్టాలనేది అయ్యప్ప భక్తుల చిరకాల స్వప్నం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం భారీగా మకరజ్యోతి దర్శనం కోసం శబరి వెళ్తుంటారు.

    ఈ నేపథ్యంలో రోడ్డు, రైళ్ల మార్గం కిటకిటలాడుతుంటుంది. తాజాగా ప్రత్యేక వాయు మార్గంతో భక్తులకు మరింత అనుకూలంగా ఉండనుంది.

    DETAILS

    శబరిమల భక్తుల కోసం స్పెషల్ ఏయిర్ పోర్ట్ కు కేంద్రం లైన్ క్లియర్

    అయ్యప్ప సన్నిధికి విమానంలో వెళ్లాలంటే కొచ్చి లేదా తిరువనంతపురంలో దిగాల్సిందే. అయితే కొచ్చిలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శబరిమలకు దాదాపు 160 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తారు.

    మరోవైపు తిరువనంతపురం నుంచి సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. తాజాగా శబరిమలకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును శాంక్షన్ చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

    రూ. 3,411 కోట్ల ఖర్చుతో ఎరుమేలిలో ఈ ఏయిర్ పోర్టు నిర్మాణం చేయనున్నారు. 2,570 ఎకరాల్లో భారీ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.

    విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది.దీంతో శబరిమలకు వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానాశ్రయం
    కేరళ

    తాజా

    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్

    విమానాశ్రయం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025