NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
    తదుపరి వార్తా కథనం
    దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
    దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

    దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

    వ్రాసిన వారు Stalin
    Mar 17, 2023
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. గురువారం ఒక్కరోజే 754కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు లేఖలు రాసింది.

    దేశంలో కొన్ని నెలలుగా కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, అయితేకొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసుల పెగుగుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు.

    వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు.

    కరోనా

    కేంద్రం సూచనలను సమర్థవంతంగా పాటించాలి: ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్

    కరోనా పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను సమర్థవంతంగా పాటించాలని రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాలని భూషణ్ సూచించారు.

    కరోనా కేసులు, ఇన్‌ఫ్లూయెంజా, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (ఎస్ఏఆర్ఐ) కేసులు పెరుగుతున్ననేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక ఫీవర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

    మహమ్మారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఇప్పటివరకు సాధించిన విజయాలను కోల్పోకుండా, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి రిస్క్ అసెస్‌మెంట్-ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని భూషణ్ నొక్కి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం మన్‌సుఖ్ మాండవీయ
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి దక్షిణ కొరియా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025