NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
    దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి
    దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి

    దేశంలో పెరుగుతున్న హెచ్‌3ఎన్2 వైరస్ మరణాలు; మొత్తం ఏడుగురు మృతి

    వ్రాసిన వారు Stalin
    Mar 14, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో హెచ్‌3ఎన్2 ఇన్‌ప్లూయెంజా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. అయితే ఈ ఇన్‌ప్లూయెంజా వైరస్ సోకి మరణాలు సంభవిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

    హెచ్‌3ఎన్2 వైరస్‌తో గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం ఒకరు చనిపోయారు. గుజరాత్‌లో తొలి మరణం. 58 ఏళ్ల మహిళ హెచ్‌3ఎన్2 వైరస్‌ బారిన పడి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

    గుజరాత్‌లో సంభవించిన మరణంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరుకుంది.

    కర్ణాటకలో తొలి మరణం నమోదైంది. కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన 82 ఏళ్ల వ్యక్తి హెచ్‌3ఎన్2 వైరస్‌ బారిన పడి మృతి చెందాడు.

    గుజరాత్

    మార్చి నెలాఖరు నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

    శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాలు ప్రకారం.. జనవరి 2 నుంచి మార్చి 5 మధ్య దేశంలో 451 హెచ్‌3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, మార్చి నెలాఖరు నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఇన్‌ప్లూయెంజా వైరస్ చికిత్సకు స్వీయ మందులు, యాంటీబయాటిక్స్ వాడకాన్ని నివారించాలని ప్రజలను కోరుతూ ఐసీఎంఆర్ ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది.

    హెచ్‌3ఎన్2 అనేది మానవేతర ఇన్‌ప్లూయెంజా వైరస్ వైరస్, ఇది సాధారణంగా పందుల్లో వ్యాపిస్తుందని, మానవులకు సోకుతుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ ఐపీఎల్
    గుజరాత్: రూ. కోట్లలో ఆస్తిని త్యజించి సన్యాసాన్ని స్వీకరించిన బాలిక భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025