Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 10, 2026
04:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ స్వయంగా తెలియజేశారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలపై పరిశీలన అనంతరం విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సీఎంకు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
🇮🇳 Central government gives in-principle approval for Vizag Metro Rail
— Indosapien🇮🇳 (@bharatontherise) February 10, 2026
▫️76.9 km project across 3 corridors
▫️Steel Plant to Kommadi is a key route
▫️Official confirmation awaited.#AndhraPradesh #Visakhapatnam pic.twitter.com/OE3pAZLS2N