NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షాక్.. విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షాక్.. విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..
    ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షాక్..

    Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ షాక్.. విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చిన కేంద్రం హోంశాఖ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    09:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది.

    కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఈడీకి కేజ్రీవాల్‌ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ప్రజా ప్రతినిధులను విచారించేందుకు ఈడీ ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశాలు ఇచ్చింది.

    తాజాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేజ్రీవాల్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వడంతో కేంద్రం చర్యలు ప్రారంభించింది.

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం తీవ్ర చర్చలకు దారి తీసింది.

    వివరాలు 

     కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

    2021-22 సంవత్సరాలకు సంబంధించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదు అయ్యింది.

    మనీ లాండరింగ్ కేసు సంబంధంగా, 2024 మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు అయ్యారు. 6 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించారు.

    అనంతరం, 2024 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

    బెయిల్ పొందిన కొన్ని రోజులకే, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతని స్థానంలో అతిషి మార్లెనా సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

    వివరాలు 

    ఫిబ్రవరి 5న ఎన్నికలు

    ఇదిలా ఉండగా, ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలు ఈసీ ద్వారా ప్రకటించబడతాయి.

    ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీల తీవ్ర ప్రచారం కొనసాగుతోంది.

    2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    అరవింద్ కేజ్రీవాల్

    Alderman: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. 'ఎల్‌జీ ఎంసీడీలో ఆల్డర్‌మ్యాన్‌ను నియమించవచ్చు  సుప్రీంకోర్టు
    Arvind kejriwal: ఢిల్లీ హైకోర్టులో నుంచి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు భారతదేశం
    Arvind Kejrival: అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్.. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ సీబీఐ
    Arvind Kejriwal: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఉపశమనం ..సెప్టెంబర్ 5న తదుపరి విచారణ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025