NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Wage For Unorganised Sector Workers: మోడీ సర్కారు దసరా కానుక.. కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    Wage For Unorganised Sector Workers: మోడీ సర్కారు దసరా కానుక.. కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం
    కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం

    Wage For Unorganised Sector Workers: మోడీ సర్కారు దసరా కానుక.. కార్మికుల వేతనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు తీపి కబురు అందించింది.వారి కనీస వేతనాలను పెంపు పై గురువారం ప్రకటన చేసింది.

    కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా, గ్రేడ్‌ ఏ ప్రాంతాల్లో నిర్మాణం, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్, అండ్‌ అన్‌ లోడింగ్ విభాగాల్లో పనిచేసే నైపుణ్యం గల కార్మికులకు రోజుకు ₹1,035 (నెలకు ₹26,910) చెల్లించాల్సి ఉంటుంది.

    పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులకు ₹868 (నెలకు ₹22,568) మరియు నైపుణ్య లేని కార్మికులకు రోజుకు ₹783 (₹20,358) చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

    ఈ వేతనాలు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్సులను (VDA) సవరించడం ద్వారా పెంచినట్లు కేంద్రం పేర్కొంది.

    వివరాలు 

     ఏడాదికి రెండుసార్లు వీడీఏ సవరణ 

    క్లరికల్, వాచ్‌మెన్లు, సాయుధ గస్తీ కాసేవారికి రోజుకు ₹954 (₹24,804) చెల్లించాల్సి ఉంటుంది.

    ఈ కొత్త వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కార్మికులను నైపుణ్యం (స్కిల్డ్), పాక్షిక నైపుణ్యం (సెమి-స్కిల్డ్), నైపుణ్య లేమి (అన్-స్కిల్డ్) ఆధారంగా ప్రాంతాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది.

    ఈ నిర్ణయంతో కార్మికులకు ముఖ్యంగా భవన నిర్మాణం, లోడింగ్, అన్-లోడింగ్, వాచ్, వార్డు, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్‌కీపింగ్, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో పనిచేసేవారికి మేలు జరుగుతుంది.

    కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు సవరించే వీడీఏ ఏప్రిల్ 1, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

    కార్మికులకు వినియోగదారుల ధరల సూచికలో సగటు పెరుగుదల ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తుంది.

    వివరాలు 

    క్రమంగా తగ్గుతున్న వినియోగదారుల ధరల సూచి 

    ఇదిలా ఉండగా, కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 2.15 శాతానికి తగ్గింది, గత ఏడాది ఇదే నెలలో ఇది 7.54 శాతంగా ఉంది.

    ఈ ఏడాది జూన్‌లో ద్రవ్యోల్బణం 3.67 శాతం ఉండగా, గతేడాది అదే సమయానికి 5.57 శాతం కాగా గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వినియోగదారుల ధరల సూచి క్రమంగా తగ్గుతూ వస్తోంది.

    అలాగే, ఢిల్లీ ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను పెంచిన గంటల వ్యవధిలోనే కేంద్రం నిర్ణయం వెలువడటం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    కేంద్ర ప్రభుత్వం

    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన  తాజా వార్తలు
    IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం  భగవంత్ మాన్
    Supreme Court : యూనియన్ ఆఫ్ ఇండియా నియంత్రణలో సీబీఐ లేదు: సుప్రీంకోర్టులో కేంద్రం సుప్రీంకోర్టు
    PM Modi : ఫలించిన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం.. 5 మంది భారతీయ నావికులను విడుదల చేసిన ఇరాన్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025