NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం
    పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి

    EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 19, 2024
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాళి మృతి చెందిందనే వార్తలపై కేంద్రం స్పందించింది.

    జులైలో తన ప్రాణాలు కోల్పోయిన అన్నా సెబాస్టియన్‌ ఉదంతంపై విచారణ జరిపిస్తామని పేర్కొంది..

    ఆమె మరణానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు చేయిస్తామని కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి శోభా కర్లాంద్లజె పేర్కొన్నారు.

    అన్నా సెబాస్టియన్ మరణం తనను తీవ్రంగా కలచినట్లు ఆమె వ్యక్తిగతంగా చెప్పుతూ, ఆమె కుటుంబానికి న్యాయం జరగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

    వివరాలు 

     పని ఒత్తిడి కారణంగానే  సెబాస్టియన్ మృతి 

    యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ ఈ ఏడాది జులై 20న మరణించారు.

    పుణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉన్నప్పుడు అస్వస్థతకు గురై, తోటి ఉద్యోగులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆమె మరణించింది.

    ఆమె మరణానికి పని ఒత్తిడి కారణమనే ఆరోపణలు ఆమె కుటుంబసభ్యులు చేసారు.

    ఈ ఆరోపణలు నేపథ్యంలో, అన్నా సెబాస్టియన్ తల్లి అనితా ఇటీవల ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాశారు,దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

    బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఉద్యోగి తల్లి చేసిన ఆరోపణలపై కేంద్రం విచారణ జరపాలని కోరారు. దీనిపై శోభా స్పందించారు.

    వివరాలు 

    లేఖలో ఏముంది? 

    యర్నెస్ట్ సంస్థలో చేరిన నాలుగు నెలలకే తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందంటూ అనితా తన లేఖలో పేర్కొన్నారు.

    సంస్థలో పని ఒత్తిడి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని, ఆమె మరణానికి కారణమైందన్నారు.

    తన కుమార్తె ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను లేఖలో వివరించారు.

    అంత్యక్రియలకు సంస్థ తరఫున ఎవరూ హాజరుకాకపోవడం మరింత బాధ కలిగించిందన్నారు.

    సంస్థలో ఇతర ఉద్యోగులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనకూడదని ఆమె లేఖలో పేర్కొన్నారు.

    యర్నెస్ట్ సంస్థ అన్నా మృతికి సంతాపం తెలిపింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, తమ వ్యవస్థలను మెరుగుపరచడానికి కృషి చేస్తామని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం

    కేంద్ర ప్రభుత్వం

    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు హైదరాబాద్
    Road accident: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం.. పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఆటోమొబైల్స్
    ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన  దిల్లీ
    IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం  పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025