NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / No-detention policy: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్‌ విధానం' రద్దు
    తదుపరి వార్తా కథనం
    No-detention policy: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్‌ విధానం' రద్దు
    పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్‌ విధానం' రద్దు

    No-detention policy: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 'నో డిటెన్షన్‌ విధానం' రద్దు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 23, 2024
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్య విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ చర్యలు చేపట్టింది.

    ఫలితంగా, ఇకపై 5వఎం,8వ తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించనివారు అదే తరగతిలో మళ్లీ చదవాల్సి ఉంటుంది.

    విద్యాహక్కు చట్టం-2019లో చేసిన సవరణ ప్రకారం, దేశంలోని 16 రాష్ట్రాలు (తెలుగు రాష్ట్రాలను మినహాయించి) రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ విధానాన్ని ఇప్పటికే రద్దు చేశాయని కేంద్రం తెలిపింది.

    గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, విద్యార్థి పై తరగతికి ప్రమోట్ కావడంలో విఫలమైతే, మళ్లీ పరీక్ష రాయడానికి కొంత సమయం ఇస్తారు.

    వివరాలు 

     రెండు నెలల లోపే రీ-ఎగ్జామ్ 

    ఫలితాల ప్రకటన తేది నుంచి రెండు నెలల లోపే రీ-ఎగ్జామ్ నిర్వహిస్తారు.

    రీ-ఎగ్జామ్‌లో కూడా ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ అదే తరగతిలోనే చదవాల్సి ఉంటుంది.

    ప్రాథమికోన్నత విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది.

    ఈ నిబంధనలు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలు వంటి దాదాపు 3 వేల కేంద్ర ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు.

    వివరాలు 

    రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం..

    పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోకి వస్తున్నందున, ఈ విషయంలో రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు.

    ఇప్పటివరకు 16 రాష్ట్రాలు, దిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు నో-డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయని, హరియాణా,పుదుచ్చేరి ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

    మిగిలిన రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్ని కొనసాగించనున్నాయి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా, డిటెన్షన్ విధానంపై కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలను గతంలో కోరింది.

    తెలుగు రాష్ట్రాల విషయంలో, ఇప్పటికీ నో-డిటెన్షన్ విధానం కొనసాగుతోందని గుర్తుచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Iran: ఇరాన్ సుదూర దాడులు చేయగల అణ్వాయుధాలపై పనిచేస్తోంది: ఆస్ట్రియా నిఘా సంస్థలు ఇరాన్
    Ponguleti Srinivasa Reddy: భూమిలేని రైతులకు శుభవార్త.. భూములకు హక్కు పట్టాలు పంపిణీ  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    SRH: ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హీరో ఎవరు..? రేటింగ్‌లో ఎవరు ముందున్నారంటే? సన్ రైజర్స్ హైదరాబాద్
    Shakur Khan: పాక్ కోసం 'గూఢచర్యం' చేసిన ప్రభుత్వ ఉద్యోగికి మాజీ మంత్రితో సంబంధాలు  రాజస్థాన్

    కేంద్ర ప్రభుత్వం

    Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు పోలవరం
    Rice Export: కేంద్ర అనుమతితో బియ్యం, నూకల ఎగుమతులకు శ్రీకారం! హైదరాబాద్
    DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025