NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Anna Canteens: గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.. 2025 మార్చి నెలాఖరులోగా ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    Anna Canteens: గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.. 2025 మార్చి నెలాఖరులోగా ప్రారంభం 
    గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు

    Anna Canteens: గ్రామీణ ప్రాంతాల్లోనూ న్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు.. 2025 మార్చి నెలాఖరులోగా ప్రారంభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 13, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మానసపుత్రిక అన్న క్యాంటీన్లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.

    గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లను వైసీపీ సర్కార్ మధ్యలో మూసేసినా, తర్వాతి కాలంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడిన తరువాత తిరిగి పునఃప్రారంభం చేసింది.

    ప్రస్తుతం ఈ క్యాంటీన్లు పట్టణ,నగర ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

    వీటి పరిధిని మరింత విస్తరించడానికి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

    ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, కలెక్టర్ల సదస్సులో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.

    వివరాలు 

    ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా 199 అన్న క్యాంటీన్లు 

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు మొత్తం 199 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.

    ఇంకా మరికొన్ని క్యాంటీన్లు నిర్మాణంలో ఉన్నప్పటికీ, వీటిని త్వరలోనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోనున్నారు.

    అయితే, ఈ అన్న క్యాంటీన్లు సరికొత్తగా ఉండడం వల్ల ప్రస్తుతం ఇవి ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

    అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం ప్రజల నుంచి డిమాండ్లు పెరిగాయి.

    దీనిని దృష్టిలో పెట్టుకుని, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించి, గ్రామాలలో కూడా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక శాఖ కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చింది.

    వివరాలు 

    తొలి విడతగా 63 క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు

    ఈ నేపథ్యంలో, నిన్న జరిగిన కలెక్టర్ల సదస్సులో, సీఎం చంద్రబాబు గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.

    స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలను తీసుకొని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాలను సూచించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

    వచ్చే ఏడాది మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో తొలి విడతగా 63 క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

    ఈ ప్రక్రియలో మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయబడతాయి.

    మరింతగా క్యాంటీన్లకు ప్రజల నుంచి స్పందన రావడం దృష్ట్యా, భవిష్యత్తులో ఈ క్యాంటీన్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌! డొనాల్డ్ ట్రంప్
    Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి! కోవిడ్
    NTR : 'డ్రాగన్' మూవీలో తారక్‌తో కలిసి నేషనల్ క్రష్ స్టెప్పులు..? జూనియర్ ఎన్టీఆర్
    Jivi Babu: బలగం నటుడు కన్నుమూత టాలీవుడ్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: ఏపీకి భారీ వర్షం.. పోర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ భారీ వర్షాలు
    Andhrapradesh: కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం భారతదేశం
    Special Task Force: జెట్‌ స్పీడ్‌తో నేషనల్‌ హైవే ప్రాజెక్టు పనులు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. భారతదేశం
    Liquor prices reduced: మందుబాబులకు గుడ్ న్యూస్.. రాయల్ ఛాలెంజ్, మాన్షన్ హౌస్, యాంటిక్విటీ ధరలు తగ్గింపు! ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025