NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhrapradesh: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhrapradesh: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..!
    ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..!

    Andhrapradesh: ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికే  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    04:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా తగ్గుదల సమస్యను అధిగమించేందుకు కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టారు.

    సంక్రాంతి సందర్భంగా నారా వారి పల్లెలో ఆయన చేసిన కీలక ప్రకటన ప్రకారం, ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్నవారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా చేయాలని ప్రతిపాదించారు.

    2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియమాన్ని అమలు చేయడంపై పరిశీలన జరుగుతోంది.

    జనాభా నియంత్రణ చర్యల కారణంగా ఉత్పాదకశక్తి కలిగిన యువతరం సంఖ్య తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరుగుదల వంటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

    దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చర్యల కారణంగా జనాభా తగ్గుదల కొనసాగుతుండటంతో, పెద్ద కుటుంబాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించారు.

    వివరాలు 

    జనాభా తగ్గుదల వల్ల కేంద్ర పన్నుల వాటాలో తగ్గిన ఆదాయం

    ఏపీ రాష్ట్రంలో జనాభా తగ్గుదల వల్ల కేంద్ర పన్నుల వాటాలో ఆదాయం తగ్గడం గమనార్హం.

    విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి సరైన ప్రోత్సాహం రాలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జనాభా పెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.

    సర్పంచ్, మేయర్, మునిసిపల్ కౌన్సిలర్ వంటి స్థానిక సంస్థల పదవులకు ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న వారు అనర్హులవుతారని, దీనిపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు.

    వివరాలు 

    రేషన్ పద్ధతుల్లో మార్పులు

    జనాభా పెంపును ప్రోత్సహించేందుకు రేషన్ పద్ధతుల్లో మార్పులు చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.

    పెద్ద కుటుంబాలకు అదనంగా బియ్యం పంపిణీ చేసే విధానాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు.

    ఉత్తర భారతదేశం ఎక్కువ జనాభా వల్ల కొంతకాలం పాటు ప్రయోజనం పొందవచ్చని, కానీ దీర్ఘకాలంలో ఇదే సమస్య అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    జనాభా తగ్గుదల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ప్రపంచంలో అనేక దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చంద్రబాబు అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి! విజయ్
    Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్! ఇన్ఫోసిస్
    AA22xA6 movie: అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకోనే.. అట్లీ స్ట్రాటజీ అదిరింది! అల్లు అర్జున్
    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ

    చంద్రబాబు నాయుడు

    CM Chandrababu: గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానిస్తాం.. జలవనరులపై సమీక్షలో సీఎం భారతదేశం
    Chandrababu: పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి.. ఇళ్లు కట్టించి ఇస్తాం: చంద్రబాబు  భారతదేశం
    Nara Ramamurthy Naidu: నారా రామ్మూర్తి ఆరోగ్య పరిస్థితి విషమం.. మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు నారా లోకేశ్
    Nara Rohith : నారా రోహిత్ కుటుంబంలో విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత  నారా రోహిత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025