
Chatrapati Shivaji: లండన్ నుంచి భారత్కు ఛత్రపతి శివాజీ ఆయుధం.. 350 ఏళ్ల తర్వాత స్వదేశానికి..
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన 'పులి పంజా' ఆయుధం తిరిగి భారతదేశం రానుంది. ఈ ఏడాదితో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అవుతోంది.
ఈ సందర్భంగా ఛత్రపతి ఉపయోగించిన వాఘ్ నఖ్ ను(పులి గోళ్లను) నవంబర్ లో స్వదేశానికి తీసుకురానున్నారు.
మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ 3 ఏళ్ల కాలానికి ఈ ఆయుధాన్ని భారత్ తెచ్చేందుకు ఒప్పంద పత్రాలపై మంగళవారం లండన్లో సంతకాలు చేయనున్నారు.
బీజాపూర్ నవాబు అఫ్జల్ ఖాన్ను ఓడించిన రోజే వాఘ్ నఖ్ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముంబైలోని శివాజీ మ్యూజియంలో ఈ మేరకు ప్రదర్శస్తామన్నారు.
దేశవ్యాప్తంగా మరో 4ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు మహారాష్ట్ర ప్రతిపాదించింది. లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వాఘ్నఖ్ను భద్రపరిచారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముంబైలోని శివాజీ మ్యూజియంలో ఈ ఆయుధం ప్రదర్శన
After 350 years, Chhatrapati Shivaji's legendary weapon " tiger claw" is set to return to Bharat 🇮🇳 from London's victoria & Albert Museum.
— kanishka Dadhich 🇮🇳 (@KanishkaDadhich) October 1, 2023
This "Wagh nakh" is an iconic weapon used to kill Afzal Khan, the general of Bijapur Sultanate in 1659. pic.twitter.com/TPAa1aBrd4