NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / DY Chandrachud : ప్రజా శాంతికి ముప్పు కలిగించే నేరాలపై దృష్టి సారించండి: డివై చంద్రచూడ్ 
    తదుపరి వార్తా కథనం
    DY Chandrachud : ప్రజా శాంతికి ముప్పు కలిగించే నేరాలపై దృష్టి సారించండి: డివై చంద్రచూడ్ 
    ప్రజా శాంతికి ముప్పు కలిగించే నేరాలపై దృష్టి సారించండి: డివై చంద్రచూడ్

    DY Chandrachud : ప్రజా శాంతికి ముప్పు కలిగించే నేరాలపై దృష్టి సారించండి: డివై చంద్రచూడ్ 

    వ్రాసిన వారు Stalin
    Apr 02, 2024
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సోమవారం మాట్లాడుతూ,సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు సంవత్సరాల పాటు అనేక అంశాలను తమ భుజాలపై వేసుకుని ముందుకు సాగలేక పోయాయని,ఏవి ముఖ్యమో వాటినే అవి ఎంచుకుని పని చేయడం ద్వారా సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు.

    జాతీయ భద్రత,దేశ ఆర్థిక ఆరోగ్యానికి,ప్రజా శాంతికి ముప్పు కలిగించే కేసులపై వారు మరింత దృష్టి పెట్టాలని కూడా ఆయన అన్నారు.

    సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)మొదటి డైరెక్టర్ జ్ఞాపకార్థం 20వ డిపికోహ్లి స్మారక ఉపన్యాసంలో ప్రసంగం సందర్భంగా సిజెఐ ఈ వ్యాఖ్యలు చేశారు.

    దర్యాప్తు అనివార్యతలు,వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య సమతౌల్యం ఉండాలని సూచించారు. సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన సోదాలు,జప్తుల సమయంలో సున్నితంగా వ్యవహరించాలన్నారు.

    Details 

    సీబీఐలో చాలా మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు

    పర్సనల్ ప్రైవసీ హక్కు అనేది పారదర్శకతకు మూల స్తంభం లాంటిదన్నారు.

    దర్యాప్తు సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారని, అందుకే అపరిమిత కేసులను చేపట్టడం వారికి పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు.

    ఇప్పటికి సీబీఐలో చాలా మంది డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారని డైరెక్టర్‌ తనకు తెలిపారన్నారు.

    కోర్టులతోపాటు సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలనూ కూడా క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు.

    కొత్తగా తీసుకొచ్చిన న్యాయ సంహిత చట్టాలు న్యాయ వ్యవస్థను ఆధునికీకరించడంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు.

    టెక్నాలజీలను వినియోగించుకుని దర్యాప్తు సంస్థలు తమ సామర్థ్యాలను పెంచుకోవాలని, కోర్టు ప్రొసీడింగ్స్‌తో అనుసంధానించుకుని సమయ నిర్దేశిత ప్రాసిక్యూషన్లను చేయాలన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డివై చంద్రచూడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    డివై చంద్రచూడ్

    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శివసేన
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025