Page Loader
YS Jagan: చిలీ సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో వైఎస్ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌!
చిలీ సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో వైఎస్ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌!

YS Jagan: చిలీ సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో వైఎస్ జగన్‌ క్వాష్‌ పిటిషన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో ఆయన పిటిషన్‌ పెట్టారు. ఈ పిటిషన్‌పై గురువారం (జూన్‌ 26) విచారణ జరగనున్నట్టు ఏపీ హైకోర్టు తెలిపింది. వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన సమయంలో వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే.

Details

కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు

ఈ కేసును గుంటూరు పోలీసులు నమోదు చేశారు. సింగయ్య మృతి కేసులో వైఎస్‌ జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణా రెడ్డి, పీఏ నాగేశ్వర్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని కూడా నిందితులుగా చేర్చబడ్డారు. తాజాగా వీరంతా ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపే కోర్టు విచారణ జరుపనున్నట్టు తెలిపింది.