Indore: హత్య తర్వాత తాంత్రిక పూజలు: ఇండోర్ ఎంబీఏ విద్యార్థిని కేసులో సంచలన వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోర్ (మధ్యప్రదేశ్)లోని ఒక నివాసంలో ఎంబీఏ చదువుతున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగించిన పోలీసులు తాజాగా కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. యువతి ఇతర వ్యక్తులతో చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో ఆమె ప్రియుడు పీయూష్ తీవ్ర ఆగ్రహానికి లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. జనవరి 11న ఆమెను తన ఫ్లాట్కు తీసుకువెళ్లిన పీయూష్ ముందుగా ఆమెతో సన్నిహితంగా వ్యవహరించినప్పటికీ, తరువాత పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని తెలిపారు. ఆ వాగ్వాదమే చివరకు హత్యకు దారితీసిందని, కోపోద్రిక్తుడైన పీయూష్ ఆమె గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు వివరించారు.
వివరాలు
హోటల్ గదిలో తాంత్రిక పూజలు
హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి మహారాష్ట్రలోని పన్వేల్కు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ ఒక హోటల్లో బస చేసిన అతడు, యువతి ఆత్మను తిరిగి తీసుకురావాలన్న మూఢనమ్మకంతో హోటల్ గదిలో తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో తనతో తీసుకువచ్చిన యువతి మొబైల్ ఫోన్ను అక్కడే ధ్వంసం చేశాడని వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి ముంబయికి వెళ్లిన పీయూష్, రాత్రంతా స్థానిక రైళ్లలో ప్రయాణిస్తూ గడిపినట్లు సమాచారం.
వివరాలు
ఫోన్ కాల్ వివరాల ఆధారంగా ప్రియుడు పీయూష్ కోసం గాలింపు
జనవరి 13న ద్వారకాపురి ప్రాంతంలో ఉన్న పీయూష్ ఫ్లాట్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఇంట్లోని మంచంపై నగ్నంగా ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఇదే సమయంలో యువతి కుటుంబసభ్యులు ఆమె కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేయడంతో, మృతురాలిని ఇందౌర్కు చెందిన ఎంబీఏ విద్యార్థినిగా గుర్తించారు. ఆమె ఫోన్ కాల్ వివరాల ఆధారంగా ప్రియుడు పీయూష్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడిని మహారాష్ట్రలో అరెస్టు చేశారు.