Loading...
UP Politics: అఖిలేశ్‌ ముందే ఎస్పీ నేతల మధ్య ఘర్షణ.. ఏటా, కాస్గంజ్‌ కమిటీలు రద్దు!
అఖిలేశ్‌ ముందే ఎస్పీ నేతల మధ్య ఘర్షణ.. ఏటా, కాస్గంజ్‌ కమిటీలు రద్దు!

UP Politics: అఖిలేశ్‌ ముందే ఎస్పీ నేతల మధ్య ఘర్షణ.. ఏటా, కాస్గంజ్‌ కమిటీలు రద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

2027 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) లక్నోలో కీలక సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ హాజరైన ఈ సమావేశంలో ఇద్దరు సీనియర్‌ ఎస్పీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామం తర్వాత ఏటా, కాస్గంజ్‌ జిల్లాల్లోని సమాజ్‌వాదీ పార్టీ జిల్లా కార్యవర్గాలను రద్దు చేశారు. ఈ రెండు జిల్లాల్లోని పార్టీ అనుబంధ విభాగాలను కూడా రద్దు చేశారు. లక్నోలో జరిగిన ఈ సమావేశానికి ఏటా, కాస్గంజ్‌ జిల్లాలకు చెందిన సుమారు 250 మంది సీనియర్‌ నేతలు, పార్టీ పదాధికారులు హాజరయ్యారు.

వివరాలు

ఇద్దరి నేతల మధ్య వాగ్వాదం

ఈ సందర్భంగా పార్టీ నేతలు మంజీత్‌ యాదవ్‌, మాజీ ఏటా జిల్లా పంచాయతీ చైర్మన్‌ జుగేంద్ర సింగ్‌ యాదవ్‌ మధ్య వివాదం మొదలైంది.

సమావేశంలో జుగేంద్ర సింగ్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై మంజీత్‌ యాదవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య మొదట వాగ్వాదం మొదలై, ఆ తర్వాత అది గొడవగా మారింది.

ఆ సమయంలో పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో పాటు ఇతర సీనియర్‌ నేతలు కూడా అక్కడే ఉన్నారు.

తాజా నివేదికల ప్రకారం, ఈ ఘటన అనంతరం ఏటా, కాస్గంజ్‌ జిల్లాల జిల్లా కార్యవర్గాలతో పాటు రెండు జిల్లాల్లోని పార్టీ అనుబంధ సంస్థల యూనిట్లను కూడా రద్దు చేశారు.

వివరాలు

ఏటా, కాస్గంజ్‌లో అసెంబ్లీ స్థానాల పరిస్థితి

2027 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ కేడర్‌ను సిద్ధం చేసే క్రమంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రెండు జిల్లాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధతపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునే ఉద్దేశంతో సమావేశం జరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ఏటా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాస్గంజ్‌ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఒక నియోజకవర్గంలో ఎస్పీ ఎమ్మెల్యే గెలిచారు.

ADVERTISEMENT

వివరాలు

అహంకారం వల్లే ఇలాంటివి జరుగుతాయి

ఈ ఘటనపై అఖిలేష్‌ యాదవ్‌ స్పందిస్తూ.. ఇలాంటివి జరుగుతుంటాయి. పర్లేదు, డబ్బుతో వచ్చే అహంకారం వల్లే ఇదంతా జరుగుతుంది.

ఎవరైనా సంపన్నులైతే చివరకు ఇతరులను వదిలిపెడుతారు. ఇప్పుడు మనమంతా కలిసి పనిచేద్దామని వ్యాఖ్యానించారు.

సమావేశంలో చోటుచేసుకున్న ఈ పరిణామం అనంతరం ఏటా, కాస్గంజ్‌ జిల్లాల పార్టీ కార్యవర్గాలు, అనుబంధ విభాగాలను రద్దు చేయడం 2027 ఎన్నికలకు ముందు ఎస్పీ సంస్థాగతంగా తీసుకున్న కీలక చర్యగా నిలిచింది.

ADVERTISEMENT