NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Punjab: గురుదాస్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. రక్షించేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడి 
    తదుపరి వార్తా కథనం
    Punjab: గురుదాస్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. రక్షించేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడి 
    Punjab: గురుదాస్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ..

    Punjab: గురుదాస్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. రక్షించేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2024
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పంజాబ్‌లోని సెంట్రల్ జైలు గురుదాస్‌పూర్‌లో రెండు గ్రూపుల ఖైదీలు పరస్పరం ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

    ఖైదీలను శాంతింపజేయడానికి పోలీసు బలగాలను పిలవడంతో,ఖైదీలు ఆగ్రహానికి గురై,పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

    జైలు ప్రాంగణాన్ని ఖైదీలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉద్రిక్తత దృష్ట్యా ఐదు జిల్లాల పోలీసులను రంగంలోకి దింపారు. దీంతోపాటు పారామిలటరీ బలగాలను కూడా రప్పించారు.

    జైలు భద్రతలో ఉన్న ఒక పోలీసు,ధరివాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మన్‌దీప్ సింగ్,ఎస్‌ఐ జగ్‌దీప్ సింగ్,పోలీసు ఫోటోగ్రాఫర్ గాయపడ్డారు.

    గాయపడిన నలుగురు పోలీసులను చికిత్స నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించారు.

    సెంట్రల్ జైలులో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది.పరిస్థితిని నియంత్రించడానికి సమీపంలోని ఐదు జిల్లాల నుండి పోలీసులు,పారామిలటరీ బలగాలను రప్పించారు.

    Details 

    గోపా గ్యాంగ్, హోషియార్‌పురియా గ్యాంగ్ మధ్య ఘర్షణ 

    జైలులో ఉన్న ఖైదీలు మంచాలు, ఇతర వస్తువులకు నిప్పు పెడుతున్నారు. రచ్చ ఇంకా కొనసాగుతోంది.

    బోర్డర్ రేంజ్ జైలులో మొత్తం ఆపరేషన్‌కు ఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన వెంట ఐదు జిల్లాల నుంచి పోలీసులు, పారామిలటరీ బలగాలు ఉన్నారు.

    జైల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా.. ఈ మధ్య జైల్లో ఉన్న ఖైదీలు పోలీసులపై రాళ్లు రువ్వుతూనే ఉన్నారు.

    సమాచారం ప్రకారం,గురుదాస్‌పూర్ సెంట్రల్ జైలులో మధ్యాహ్నం 12 గంటలకు గోపా గ్యాంగ్‌స్టర్, ప్రతాప్ సింగ్ హోషియార్‌పురియా ముఠాకు చెందిన మరో ఖైదీ మధ్య ఏదో సమస్యపై అకస్మాత్తుగా వివాదం ప్రారంభమైంది.

    Details 

    పోలీసులపై దాడికి పాల్పడిన ఖైదీలు  

    దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాట జరిగింది.

    గొడవ జరుగుతుండడం చూసి జైలు భద్రత కోసం మోహరించిన పోలీసులు వారిని శాంతింపజేసేందుకు వెళ్లగా ఇరువర్గాల ఖైదీలు పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

    ఎలాగోలా వారి ప్రాణాలను కాపాడుకున్న పోలీసు సిబ్బంది అక్కడి నుంచి బయటకు వచ్చారు.

    ఖైదీల హంగామా చూసి జైలులో ఉన్న ఇతర భద్రతా సిబ్బంది కూడా పరుగులు తీశారు.

    ఈ సమాచారాన్ని వెంటనే ధరివాల్ పోలీస్ స్టేషన్‌కు అందించారు. సమాచారం అందిన వెంటనే ధరివాల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ మన్ దీప్ సింగ్, ఎస్ ఐ జగదీప్ సింగ్ పోలీసు బలగాలతో సెంట్రల్ జైలుకు చేరుకున్నారు.

    Details 

    ఇంకా ఉద్రిక్తంగానే పరిస్థితి 

    పోలీసు స్టేషన్‌లోని పోలీసులు లోపలికి వెళ్లగానే ఖైదీలు వారిపై కూడా దాడి చేయడంతో ఎస్‌హెచ్‌ఓ మన్‌దీప్‌సింగ్‌, ఎస్‌ఐ జగదీప్‌సింగ్‌, కానిస్టేబుల్‌, పోలీసు ఫొటోగ్రాఫర్‌కు గాయాలయ్యాయి.

    పరిస్థితి ఉద్రిక్తంగా మారడం గమనించిన సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇతర పోలీస్ స్టేషన్ల నుండి పోలీసు బలగాలను పిలిపించారు.

    దీంతో పాటు పారామిలటరీ బలగాలను కూడా అక్కడికక్కడే మోహరించారు.

    ప్రస్తుతం పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఖైదీలను శాంతింపజేయడానికి బోర్డర్ రేంజ్ జైలులో ఐజి ఉన్నారు.

    వీరితో పాటు పోలీసు, పారామిలటరీ బలగాలకు చెందిన సైనికులు కూడా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    పంజాబ్

    ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు  ఎన్ఐఏ
    డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు  భారతదేశం
    పంజాబ్ రైతుకూలీల రైల్ రోకో.. పట్టాలపై పడుకుని నిరసనలు భారతదేశం
    పంజాబ్‌: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025