
Chandrababu: సీఎం చంద్రబాబుకు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంతవరకు ఆయన వినియోగించిన హెలికాప్టర్ చాలా పాతదైపోవడంతో, ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త హెలికాప్టర్ను ఉపయోగించడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం,గత రెండు వారాలుగా జిల్లాల పర్యటనలకు ఈ కొత్త హెలికాప్టర్ ద్వారానే వెళ్తున్నారు. గతంలో వాడిన బెల్ కంపెనీ తయారీ హెలికాప్టర్ పాత మోడల్ కావడంతో, ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఎయిర్బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ హెలికాప్టర్ సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అనువుగా ఉంటుందని నిపుణులు సూచించడంతో దానిని ఎంపిక చేశారు. అయితే,పాత హెలికాప్టర్ ఎక్కువ దూరం ప్రయాణానికి పనికొచ్చేది కాదు
వివరాలు
నివాసం నుంచే జిల్లాల పర్యటనలకు..
దీంతో,ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనకైనా వెళ్లాలంటే, మొదటగా ఉండవల్లి నివాసంలోని హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన ప్రాంతానికి సమీపంలోని ఎయిర్పోర్టుకు వెళ్లేవారు. ఈప్రక్రియ మొత్తం చాలా సమయం తీసుకునేది.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్త హెలికాప్టర్ ద్వారా సీఎంచంద్రబాబు నేరుగా తన నివాసం నుంచే జిల్లాల పర్యటనలకు వెళ్ళగలుగుతున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోనుంది. అదనంగా,పైలట్లతో పాటు ఆరుగురు ప్రయాణికులు కూడా ఇందులో సౌకర్యవంతంగా ప్రయాణించగలరు. రక్షణపరంగా కూడా ఈ హెలికాప్టర్ మరింత భద్రతా ప్రమాణాలు కలిగి ఉందని చెబుతున్నారు. సాంకేతికతను వినియోగించడంలో ఎప్పుడూ ముందుండే చంద్రబాబు,ఇప్పుడు తన ప్రయాణాలకు ఉపయోగించే హెలికాప్టర్ సైతం అత్యాధునిక సౌకర్యాలతో ఉండేలా చూసుకున్నారని స్పష్టమవుతోంది.