NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి
    వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి

    Chandrababu: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    03:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

    కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు.

    వచ్చే మూడు నెలల్లో ప్రజల మధ్య ప్రవేశించే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా పనిచేస్తూ ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

    తద్వారా, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చలు జరిపారు.

    వివరాలు 

    బడులు తెరిచే నాటికి  డీఎస్సీ పోస్టుల భర్తీ 

    ఏప్రిల్‌లో మత్స్యకారులకు భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు.

    అన్నదాత సుఖీభవకి సంబంధించి విధివిధానాలు రూపొందించడంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

    కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్రం మరో రూ.14 వేలు జోడించి ఇచ్చే అంశంపై కృషి చేయాలని తెలిపారు.

    కేంద్రంతో కలిసి మూడు విడతలుగా రాష్ట్రం ఆర్థిక సహాయం అందించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు.

    బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు.

    వివరాలు 

    నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు చర్యలు

    రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు.

    సమగ్ర పవర్ మేనేజ్మెంట్ ద్వారా విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గించే అవకాశముందని పేర్కొనటంతో పాటు, సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతంగా అమలు చేయాలని కలెక్టర్లు, విద్యుత్ ఎస్ఈలకు ఆదేశాలు ఇచ్చారు.

    విద్యుత్ సంస్కరణల భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

    అంగీకరించిన పెట్టుబడుల అమలును సమీక్షించి, దానికి అనుగుణంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని అన్నారు.

    వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే లోగా డీఎస్సీ నియామకాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

    నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    ENG vs IND: ఓపెనింగ్‌కి సుదర్శన్-జైస్వాల్.. గిల్‌కి మిడిలార్డర్‌లో ఛాన్స్ ఇవ్వండి: పాంటింగ్ టీమిండియా
    Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు టాలీవుడ్
    Chandrababu: పార్టీకి చెడ్డపరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక చంద్రబాబు నాయుడు
    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన సీఎం భారతదేశం
    CBN Collectors Meeting: రేషన్, గంజాయి, డ్రగ్స్‌ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు భారతదేశం
    Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు  భారతదేశం
    CM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025